ఇటీవల కాలంలో నేరాలు చేస్తున్న ఎన్నారైల సంఖ్య బాగా పెరిగిపోతోంది. ఫారిన్ కంట్రీస్‌లో వీరు చట్ట విరుద్ధమైన పనులు చేస్తూ చివరికి కఠిన కారాగార జైలు శిక్షకు గురవుతున్నారు. తాజాగా యూకేలో మరో ముగ్గురు ఎన్నారైలు ఓ నేరం చేసి ఏకంగా 45 ఏళ్ల జైలు శిక్షకు గురైనారు. ఇంగ్లాండ్‌లో ఒక వ్యాపారవేత్తను కిడ్నాప్ చేసిన కేసులో భారతదేశానికి చెందిన ఇద్దరు సోదరులు, వారి స్నేహితుడు కట్టుబడినట్లు యూకే అధికారులు తెలిపారు. వారికి ఇటీవల కోర్టులో 45 సంవత్సరాలకు పైగా శిక్ష పడినట్లు వెల్లడించారు.

ఎన్నారై దోషులు పని ముగించుకుని కారు వద్దకు వెళ్తుండగా వ్యాపారవేత్తను పట్టుకున్నారు. అతన్ని బలవంతంగా వ్యాన్‌లోకి ఎక్కించి, కట్టేసి, కళ్లకు గంతలు కట్టారు. అనంతరం ఓ దుకాణానికి తీసుకెళ్లి తుపాకీతో బెదిరించారు. వ్యాపారవేత్త నుంచి డబ్బు దోచేయాలని వారు బాధితుడిని గంటల తరబడి బందీగా ఉంచారు. దాంతో బాధితుడు తన కొలీగ్‌కి ఈ సమాచారం అందించాడు. దాంతో సదరు కొలీగ్ ఒక బస్ స్టాప్‌కి వచ్చి కిడ్నాపర్లు అడిగినట్లుగా రాన్సమ్ డబ్బును విడిచిపెట్టి వెళ్లాల్సి వచ్చింది. తర్వాత వారు చివరకు వ్యాపారవేత్తను విడుదల చేశారు.

ఈ వ్యవహారమై కేసు నమోదు కాగా దానిని ఛేదించేందుకు పోలీసులు కెమెరాలు, ఫోన్ రికార్డులను ఉపయోగించారు.  ఎన్నారై సోదరులు, వారి స్నేహితుడు కలిసి ఈ నేరాన్ని ప్లాన్ చేశారని, వారి ఫోన్‌లలో "రాబర్స్ గ్యాంగ్" అని పిలిచే గ్రూప్ చాట్ కూడా చేశారని వారు కనుగొన్నారు. గాలింపు సమయంలో ఇద్దరు సోదరులు వేర్వేరు ప్రదేశాల్లో పట్టుబడ్డారు  వారి స్నేహితుడు యూఎస్‌కి తప్పించుకోవడానికి ప్రయత్నించాడు కానీ విమానాశ్రయంలోనే దొరికిపోయాడు.

ఎన్నారై సోదరులు తాము నిర్దోషులమని చెప్పారు, కానీ స్నేహితుడు నేరాన్ని అంగీకరించాడు. ఇప్పుడు వాళ్ళు చేసిన పని వల్ల చాలా కాలం జైల్లో మగ్గిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వ్యాపారవేత్త ఇప్పుడు సురక్షితంగా ఉన్నాడు. ఇలాంటి నేరాలు మళ్లీ పునరావృతం కాకుండా పోలీసులు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఇటీవల కాలంలో ఎన్నారైలు హింస, మోసం, దొంగతనం, రేప్ వంటి నేరాలలో చిక్కుకుపోయి కటకటాల పాలయ్యారు. ఇతర దేశాల్లో న్యాయస్థానాలు త్వరగా తీర్పులు ఇవ్వడం వల్ల వీరు వెంటనే జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంటోంది. భారత సంతతికి చెందిన వీరు నేరాలు చేయడం మొత్తం భారతదేశనికే అపకీర్తిని తీసుకొస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Uk