బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాలా నిత్యం వివాదాలతో వార్తల్లో ఉంటుంది. తన ఆట తీరు కంటే తన వివాదాలతోనే ఎక్కువగా ప్రాచుర్యం పొందింది. అయితే తాజాగా ఈమె కేటీఆర్ మీద ఫైర్ అయ్యింది. బ్యాడ్మింటన్ అకాడమీ ఏర్పాటుకు తనకు సహకారం ఇస్తామని హామీ ఇచ్చిన టీఆర్ఎస్ సర్కారు నాలుగేళ్లవుతున్నా మాట నిలబెట్టుకోలేదని, ఇప్పటివరకూ స్థలం కేటాయించలేదని ట్వీట్ చేసింది ఫైర్ బ్రాండ్ గుత్తా జ్వాల.

Image result for gutta jwala

ప్రోత్సాహకాల కింద క్రీడాకారులకు ఇంటిస్థలం కేటాయిస్తామని చెప్పినా.. ఇంతవరకూ ఇవ్వలేదని, అదే సమయంలో తనకు తప్ప మిగతా వారందరికీ స్థలాలు దక్కాయని వాపోయింది జ్వాల. తన సమస్య చర్చకు రావాలంటే కేటీఆర్ ని ట్యాగ్ చేస్తేనే అది హైలెట్ అవుతుందని ఆమె నమ్మకం. అందుకే ఇలా చేసింది. కొంతకాలంగా వరుస వైఫల్యాలతో ఆటకి దూరమైన గుత్తాజ్వాల అకాడమీ ఏర్పాటుకి సన్నాహాలు చేసుకుంటోంది.

Image result for gutta jwala

కానీ కేసీఆర్ సర్కార్ మాత్రం ఈమె విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకోవాలనుకుంటోంది. అయితే ఎన్నికల ఏడాది కాబట్టి తను పట్టుబడితే ఫలితం ఉంటుందని గుత్తాజ్వాల ఆశ. అందుకే ఇప్పుడు గళమెత్తింది. ఇక్కడ పెద్ద ట్విస్ట్ ఏంటంటే.. తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ట్వీట్స్ చేసిన జ్వాల, కొద్దిసేపటికే వాటిని డిలీట్ చేసింది. అంటే తెరవెనక మేటర్ సెటిల్ అయినట్టే.


మరింత సమాచారం తెలుసుకోండి: