దేశంలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తుంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం వారికీ అండగా నిలవడానికి పలు పథకాలను అమలులోకి తీసుకొచ్చారు. అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాల పథకాలు అందిస్తోంది. వీటిల్లో ప్రధాన్ మంత్రి శ్రమ్ యోగి మాన్‌ధన్ యోజన కూడా ఒకటి. ఈ పథకంలో నెలకు రూ.55 ఇన్వెస్ట్ చేస్తూ వస్తే.. ప్రతి నెలా చేతికి రూ.3,000 పొందొచ్చు. 60 ఏళ్ల తర్వాత పెన్షన్ రూపంలో ఈ రూ.3 వేలు తీసుకోవచ్చు. అసంఘటిత రంగంలో పనిచేసే వారికి ఈ స్కీమ్ వర్తిస్తుంది. ఇప్పటికే 39 లక్షల మంది ఈ పథకంలో చేరారని నిపుణులు తెలియజేశారు.

 

 

అయితే శ్రమ్ యోగి మాన్‌ధన్ యోజన పథకంలో చేరాలంటే 18 ఏళ్ల వయసు ఉండాలి. అలాగే 40 ఏళ్లు దాటకూడదు. ఇంకా నెలకు రూ.15,000కు మించి సంపాదించకూడదని సమాచారం. ఈ అర్హతలు కలిగిన వారు ఈ పథకంలో వెంటనే చేరొచ్చు. వయసు ప్రాతిపదికన మీరు చెల్లించే మొత్తం కూడా మారుతుంది. 18 ఏళ్ల వయసులోనే స్కీమ్‌లో చేరితే నెలకు రూ.55 చెల్లించాల్సి ఉంటుంది. అదే 40 ఏళ్ల వయసులో స్కీమ్‌లో చేరితే నెలకు రూ.200 కట్టాలి. 29 ఏళ్ల వయసులో చేరితే నెలకు రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. 60 ఏళ్ల తర్వాత స్కీమ్‌లో చేరిన ప్రతి ఒక్కరూ రూ.3,000 పెన్షన్ తీసుకోవచ్చు.

 

 

అయితే మీకు దగ్గరిలోని కామన్ సర్వీస్ సెంటర్‌కు వెళ్లి పీఎం శ్రమ్ యోగి మాన్‌ధన్ యోజన పథకంలో చేరొచ్చు. ఆధార్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ నెంబర్, మొబైల్ నెంబర్ వంటి వివరాలు అందించాల్సి ఉంటుంది. నామినీ ఫెసిలిటీ కూడా ఉంది. మీ వివరాలు కంప్యూటర్‌లో ఎంటర్ చేసిన తర్వాత నెలకు ఎంత కట్టాలో తెలుస్తుంది. మీరు ఆ డబ్బులు కట్టాలి. ఇప్పుడు మీకు శ్రమ్ యోగి కార్డు అందిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: