కేంద్ర ప్రభుత్వం మహిళలకు తీపి కబురు చెప్పింది. తాజాగా కేంద్ర ప్రభుత్వం మహిళలకు ప్రత్యేక స్కీమ్ అందిస్తోంది. ఇక ఇందులో చేరిన వారికి రూ.6,000 లభిస్తాయని అధికారులు తెలిపారు. అయితే ఇది అందరికీ అందుబాటులో లేదని వెల్లడించారు. ఇది కేవలం గర్భిణీ స్త్రీలకు మాత్రమే వర్తిస్తుందని తెలిపారు.

అయితే కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాల స్కీమ్స్ అందిస్తోంది. ఇక వీటిల్లో ప్రధాన్ మంత్రి మాతృ వందన యోజన PMMVY కూడా ఒకటి. ఈ పథకం కేవలం గర్భిణి స్త్రీలకు మాత్రమే అందుబాటులో ఉందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఈ పథకం ద్వారా ప్రెగ్నెంట్ లేడీస్‌కు రూ.6,000 ఆర్థిక సాయం అందజేస్తున్నారు. ఇక ఈ డబ్బులు నేరుగా మహిళల బ్యాంక్ అకౌంట్లలోనే జమవుతుంది.

అంతేకాదు తల్లి, బిడ్డ ఆరోగ్య భద్రత లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ పథకం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇది తొలి బిడ్డకు మాత్రమే ఇది వర్తిస్తుంది. అంటే తొలిసారి గర్భం దాల్చిన మహిళలకు రూ.6,000 లభిస్తాయి. ప్రధాన్ మంత్రి మాతృ వందన పథకం కింద వచ్చే రూ.6,000 మూడు విడతల్లో అందిస్తారని తెలిపారు. ఇక అంగన్‌వాడీ సెంటర్ లేదా ఆశా వర్కర్ వద్దకు వెళ్లి ఈ స్కీమ్‌లో చేరొచ్చునని తెలిపారు.

ఇక ప్రెగ్జెన్సీ వచ్చిన మహిళలు స్కీమ్‌లో చేరిన వెంటనే తొలి విడత కింద రూ.1,000 వస్తాయన్నారు. రెండో విడత కింద రూ.2,000 డబ్బులు వస్తాయి. ప్రెగ్జెన్సీ వచ్చిన ఆరు నెలల తర్వాత ఈ డబ్బులు పొందొచ్చునన్నారు. ఇక చివరి విడత రూ.2,000 డబ్బులు బిడ్డ పుట్టిన తర్వాత వస్తాయని తెలిపారు. ఇక్కడ బిడ్డకు బీసీజీ, ఓపీవీ, డీపీటీ, హెపటైటిస్ బి వంటి ఇంజెక్షన్లు వేయించి ఉండాలి. ఆ తర్వాతనే ఈ డబ్బులు వస్తాయని తెలిపారు.

అంతేకాక ఈ రూ.5,000 కాకుండా జనని సురక్ష యోజన కింద డెలివరీ అయిన వెంటనే మహిళకు రూ.1,000 అందిస్తారని అధికారులు తెలిపారు. ఇక హాస్పిటల్‌లోనే ఈ డబ్బులు పొందొచ్చునన్నారు. ఈ విధంగా మహిళలు కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.6,000 ఆర్థిక సాయం పొందొచ్చునని తెలిపారు. మీ కుటుంబంలో కూడా ఎవరైనా ప్రెగ్నెంట్స్ ఉంటే ఈ విషయాన్ని వారికి తెలియజేసి స్కీమ్‌లో చేరేలా చూడండి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: