ఆంధ్రప్రదేశ్ లో దేవాలయాల మీద దాడుల అంశాన్ని తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం బిజెపి నేతలు కాస్త ఎక్కువగా చేస్తున్నారు. రాజకీయంగా బిజెపి నేతలు ఈ మధ్య కాలంలో దేవాలయాల మీద దాడుల అంశాన్ని తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక తాజాగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు  అధికార విపక్షాల మీద కీలక వ్యాఖ్యలు చేసారు. హిందుత్వం అనేది మతం కాదు అని అన్నారు. చర్చిలు , దర్గాలు కడుతూ, పాస్టర్లకు జీతాలు ఇచ్చిన వాళ్లు మతతత్వ వాదులు అని ఆయన మండిపడ్డారు.

ఇద్దరు మంత్రులు తిరుపతిలో క్రిస్టియన్లకు శుభాకాంక్షలు చెప్పారు అని ఆయన పేర్కొన్నారు.  బీజేపీపై నిరాధారమైన ఆరోపణలు డిజిపి చేశారు అని తీవ్ర వ్యాఖ్యలు చేసారు. డీజీపీతో పాటు మంత్రి కూడా అబద్ధాలు చెబుతున్నారు అని మండిపడ్డారు.  ఆ ప్రకటన వెనక్కి తీసుకోవాలి. అందులో నిజం లేదు.. డీజీపీని  తొలగించాలని కోరుతున్నాం అని అన్నారు.  అప్పట్లో వెల్లంపల్లి  మాతో  ఉండి , కూల్చివేతల పై ఉద్యమం చేశారు అని ఆయన గుర్తు చేసారు. చర్చలు , దర్గాలు కడితే విద్వేషాలు లేనిది మేము  గుడి  కోసం పాదయాత్ర చేస్తే విద్వేషాలు వస్తాయా అని నిలదీశారు.

18 నెలల పాలనపై... మేము రాష్ట్రం కోసం ఏం చేసామో ఎవరితోనైనా చర్చకు సిద్ధం అని నిలదీశారు. దేవాలయాలు ధ్వంసం పై ఎవరిని  ఎందుకు అరెస్టు చేయడం లేదు అని ఆయన ప్రశ్నించారు. రాజకీయ పరమైన డ్రామా ప్రభుత్వం ఆడుతుంది.. హిందువులంటే ప్రభుత్వానికి  భయమా అని  నిలదీశారు. హిందువుల నిధులు వాడుకుంటారు.. ప్రజల నిధులతో చర్చిలు కడతారు.. ఇది అడిగితే మతతత్వం అంటారా అని ప్రశ్నించారు. సోము వీర్రాజు చంద్రబాబు  ట్రాప్ లోకి వెళ్ళారు అని అంటున్నారు అని... ఆయనే మా  ట్రాప్  లోకి రావాలి అని అన్నారు. గుడులను పరిరక్షించలేకపోతే  దేవాదాయ శాఖ మంత్రి రాజీనామా చెయ్యాలి అని డిమాండ్ చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: