బైంసా లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుంది అని మండిపడ్డారు. అధికారులు , పోలీసులు ఎంఐఎం తో కుమ్మక్కు అయ్యారు అని ఆరోపించారు. దీనివల్ల శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందని గవర్నర్ కు ఫిర్యాదు చేసామని వివరించారు. పక్క రాష్ట్రాలకు చెందిన లుచ్చా , లఫంగి గాళ్ళు అల్లర్లు సృష్టిస్తున్నారని ఆరోపించారు. దీనిపై ప్రభుత్వం ఇప్పటివరకు విచారణ చేయలేదన్నారు. అక్కడ ఉన్న వాళ్ళు అంత కూలి ,నాలి చేసుకుంటూ ఉన్నారని, స్వయంగా కొంతమంది ఐ పి ఎస్ లు ఇండ్లలోకి వెళ్లి హిందువులను టార్గెట్ చేస్తున్నారని మండిపడ్డారు.
అన్ని రాకలుగా నష్టపోయింది హిందువులే. ఆఖరుకు చిన్న పిల్ల మీద హత్యాచారం చేశారని, ఇన్ని జరుగతున్న ముఖ్యమంత్రి నోరు విప్పడు. ప్రజా సంఘాలు , పౌర హక్కుల సంఘాలు నోరు విప్పరని మండిపడ్డారు. థర్డ్ డిగ్రీ ఉపయోగించి ...కోర్ట్ లో చెప్తే ఎన్కౌంటర్ చేస్తామని భయబ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపణలు చేసారు. ముఖ్యమంత్రి కి కుటుంభం లేదా.. మనుమలు , మనుమారాళ్లు ఉన్నారుగా... మీ కుటుంభం లో ఇలా జరిగితే ఉరుకుంటారా?? అని నిలదీశారు బండి సంజయ్.