
కాళేశ్వరం ప్రాజెక్ట్... ఈ వరల్డ్ లోనే చాలా పెద్దదైన ఎత్తిపోతలపథకం. కాళేశ్వరం గొప్పతనమేంటో ప్రపంచం కళ్లారా చూస్తోంది. ఈ భూగర్భంలో అత్యాధునిక నిర్మాణం.. చాలా పొడవుగా ఉండే సొరంగం.. పెద్దపెద్ద మోటార్లతో నిర్మితమైంది కాళేశ్వరం ప్రాజెక్ట్. ఇది జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉంది. మహదేవ్ పూర్ మండలంలోని కన్నెపల్లి సమీపంలో నిర్మించారు. గోదావరి నదిపై ఈ ప్రాజెక్ట్ కట్టడం విశేషం.
కాళేశ్వరం ప్రాజెక్టు ఆయకట్టు 45లక్షల ఎకరాలు. దీని ప్రధాన లక్ష్యం 235టీఎంసీల నీటిని ఎత్తిపోయడమే. గోదావరి నీటి ఎక్కువగా వాడటానికే ఈ ప్రాజెక్టును నిర్మించారు. ముఖ్యంగా కరువు ప్రాంతాలకు నీరు మరలించే విధంగా కట్టారు. తెలంగాణ ప్రభుత్వం అన్ని హంగులతో నిర్మించిన ఈ ప్రాజెక్టు నేషనల్ లెవల్ లోనే కాదు.. ఇంటర్నేషనల్ లెవల్ లో వెలుగొందుతోంది. ఈ మధ్య కాలంలోనే కాళేశ్వరం ప్రాజెక్టపై డిస్కవరీ ఛానెల్ ద్వారా డాక్యుమెంటరీ రూపొందింది.
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించేందుకు 80వేల 500కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా 13జిల్లాలకు సాగు నీరు అందుతోంది. ఈ ప్రాజెక్ట్ కట్టడానికి 80వేల ఎకరాల భూమిని సేకరించారు. మరోవైపు మూడు వేల హెక్టార్ల అటవీ ప్రాంతాన్ని ఉపయోగించుకుంటున్నారు. తాగునీటి అవసరాలకు, సాగునీటి అవసరాలకు, పరిశ్రమలకు ఈ నీటిని వినియోగిస్తున్నారు. ప్రాజెక్ట్ ఉద్దేశ్యం ఏంటి.. ఎందుకు నిర్మించారు.. ఎంత ఖర్చుపెట్టారు.. ఎంత స్థలం సేకరించారు.. ఏ ఏ నిర్మాణాలున్నాయి.. ఎవరికి ఉపయోగం లాంటి విషయాలను పాఠ్యాంశంలో వివరంగా పొందుపర్చనున్నారు. దీనివల్ల విద్యార్థులకు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి పూర్తి వివరాలు తెలుసుకోనున్నారు.