
ఇప్పుడు తాజాగా జగన్ సర్కార్పై మరో ప్రముఖ దర్శకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదటి నుంచి జగన్ ప్రభుత్వంపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు సంచలన దర్శకులు రామ్ గోపాల్ వర్మ. ప్రస్తుతం ప్రభుత్వం వర్సెస్ టాలీవుడ్ అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. ఈ సమయంలో జగన్ సర్కార్ తీరును తీవ్రంగా తప్పుబట్టారు రాము. టికెట్ ధర విషయంలో ప్రభుత్వ పెత్తనం ఏమిటంటూ ప్రశ్నించారు. టికెట్ ధరను నిర్ణయించే హక్కు కేవలం ఉత్పత్తి దారుడికి మాత్రమే ఉంటుందని ఆర్జీవీ కామెంట్ చేశారు. అసలు టికెట్ల ధరలను ప్రభుత్వాలు తగ్గించడం ఏమిటని కూడా రాము ప్రశ్నించారు. వస్తువు తయారు చేసిన వ్యక్తికే దాని ధరను నిర్ణయించే అధికారం ఉంటుందని... ఆ ధరకు కొనాలా.... వద్దా అనేది వినియోగదారుల ఇష్టం అని సూచించారు ఆర్జీవీ. అదే విధంగ సినిమా టికెట్ల ధరలను నిర్మాతలు నిర్ణయించుకుంటే... ప్రభుత్వానికి వచ్చిన నష్టం ఏమిటో చెప్పాలని వర్మ నిలదీశారు. ప్రభుత్వానికి కేవలం పన్నులు మాత్రమే వసూలు చేసుకునే హక్కు ఉందన్నారు. అంతే కానీ... ధరల విషయంలో ప్రభుత్వ పెత్తనం తనకు ఏ మాత్రం అర్థం కావడం లేదన్నారు ఆర్జీవీ.