ప్రజల ద్రుష్టిని మళ్లించడానికే కేసీఆర్ రాజ్యాంగాన్ని తిరగరాయాలని వ్యాఖ్యలు చేశారని.. టీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగే అవినీతి బయటకు రావొద్దనే లక్ష్యంతోనే కేసీఆర్ ప్రజలను దారి మళ్లించేందుకు జరుగుతున్న కుట్ర ఇది అన్నారు బండి సంజయ్.  తెలంగాణ విమోచన దినోత్సవాన్ని తెరమరుగు చేయడం అందులో భాగమేనని.. ఏ రాజ్యాంగం మీద సీఎంగా ప్రమాణం చేశారో... అదే రాజ్యాంగం ద్వారా మరో వ్యక్తి సీఎం కాకూడదని కేసీఆర్ భావిస్తున్నరు. అందుకే రాజ్యాంగాన్ని తిరగరాయాలంటున్నడని ఫైర్‌ అయ్యారు బండి సంజయ్. అంబేద్కర్ రాజ్యాంగం అంటే కేసీఆర్ కు గిట్టదని.. కేసీఆర్ కొత్త రాజ్యాంగంలో రిజర్వేషన్ల ఊసే ఉండకూడదనుకుంటున్నడన్నారు. ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భ్రుతి, ఉద్యోగాలు, డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వాల్సిన అవసరం లేదంటున్నడని,, రుణమాఫీ పూర్తిగా అమలు చేయాల్సిన అవసరం లేదనుకుంటున్నడని ఫైర్‌ అయ్యారు. 

తాను ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఎవరూ ప్రశ్నించకూడదనే ఉద్దేశంతోనే రాజ్యాంగాన్ని మార్చాలనుకుంటున్నడని.. కల్వకుంట్ల రాజ్యాంగం వస్తే తన కుటుంబం మాత్రమే రాజ్యం ఏలాలన్నది కేసీఆర్ కుట్ర అని నిప్పులు చెరిగారు.అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా కేసీఆర్ కు ఉన్న ఇబ్బందులేమిటో చెప్పాలని.. భారత రాజ్యాంగంపై నమ్మకం లేనప్పుడు... సీఎం పీఠంపై కూర్చునే అర్హత కేసీఆర్ కు లేదన్నారు. ఏదైనా ఇబ్బందులుంటే రాజ్యాంగాన్ని సవరించుకునే అవకాశం ఉంది. ఇప్పటికి 105 సార్లు సవరణలు చేశారన్నారు.. కానీ పూర్తిగా రాజ్యాంగాన్ని తిరగరాయాలని అంటున్నాడంటే కేసీఆర్ లో ఉన్న అహంకార భావం కన్పిస్తోందన్నారు.  కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై మేధావులు పూర్తి స్థాయిలో స్పందించకపోవడం బాధాకరమని బండి సంజయ్ చెప్పారు.మేధావులు, న్యాయవాదులు, విద్యావేత్తలు... కేసీఆర్ వ్యాఖ్యలపై లోతుగా చర్చించాలన్నారు బండి.   కేసీఆర్ దారి మళ్లిస్తున్నా బీజేపీ మాత్రం ఆ ఉచ్చులో పడబోదని.. 317 జీవో, నిరుద్యోగ భ్రుతి, ఉద్యోగాల భర్తీసహా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతున్నామన్నారు. రాజ్యాంగాన్ని తిరగ రాయాలన్న కేసీఆర్ పై చట్ట, న్యాయపరమైన చర్యలు తీసుకునేలా న్యాయవాదులు పోరాడాలని కోరుతున్నామన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: