ఈ సందర్భంగా వై సతీష్ రెడ్డి మాట్లాడుతూ.... నాటి రామదాసు భద్రాద్రి నిర్మించినట్లే... మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎంతో భక్తి శ్రద్ధలతో యాదాద్రి ఆలయ పునర్మిణాన్ని చేపట్టి విజయవంతం చేశారని అన్నారు. స్వయానా ఆ యాదగిరి నారసింహుడి ఆశిస్సులతోనే, స్వామివారి కృపతోనే కేసీఆర్ చేత ఉద్యమం చేపించి, తెలంగాణ తెప్పించి, రాష్ట్ర నాయకుడిగా తన ఆలయాన్ని పునర్ నిర్మాణం చేయించుకున్నారని అన్నారు.
ఒకనాటి పాతగుట్ట నరసింహ స్వామి పాత ఆలయం ఎందరో భక్తజనుల తీర్థ యాత్రాస్థలిగా విరాజిల్లింది. నేడు అది యాదాద్రి నవ నారసింహ క్షేత్రమై భక్తకోటిని అలరించబోతున్నది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన, సుందరమైన ఆధ్యాత్మిక నగరిగా శోభిళ్లనుంది. సుమారు రూజ 2 వేల కోట్ల వ్యయంతో యాదాద్రి ఆలయాన్ని పునర్మించేందుకు సంకల్పించారు సీఎం కేసీఆర్. వారి సంకల్పంతో హృదయంగమైన దేవస్థానంగా తీర్చిదిద్దబడింది.