తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అమెరికాలో పర్యటిస్తున్నారు. డల్లాస్ లో జరిగిన ఓ కార్యక్రమంలో తెలంగాణవారిని ఉద్దేశించి ప్రసంగించారు. ఎక్కడో మారుమూల పల్లెల్లో పుట్టి అమెరికా లో ఎంతగానో ఎదిగిన మిమ్మల్ని చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉందని రేవంత్ రెడ్డి అన్నారు. అమెరికా అభివృద్ధిలో మీ భాగస్వామ్యం ఉండడం గర్వంగా ఉందన్న రేవంత్ రెడ్డి..  తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కోసం టి.డి. ఎఫ్ ఏర్పాటు చేసి మీరు తెలంగాణ కోసం ఎంతో కష్టపడ్డారని గుర్తు చేశారు.


మీరు ఇక్కడ ఎంతో శ్రమిస్తూ మీ అభివృద్ధి కోసం దేశం అభివృద్ధి కోసం పాటు పడుతున్నారని...తెలంగాణ కోసం ఎంతో మంది యువకులు, విద్యార్థులు ప్రాణ త్యాగాలు చేశారని.. వారి త్యాగం, సోనియమ్మ దీవెన వల్ల తెలంగాణ గా వచ్చిందని... ఎన్నో పార్టీలను ఒప్పించి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిందని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. సోనియా గాంధీ, కాంగ్రెస్ పార్టీ  తెలంగాణ ప్రత్యక రాష్ట్రం ఇచ్చిన సోనియమ్మ కు తెలంగాణలో అధికారంలోకి తెచ్చి బహుమతి ఇవ్వాలన్న రేవంత్ రెడ్డి.. తెలంగాణ ఏ లక్ష్యం కోసమైతే తెచుకున్నామో ఇప్పుడు ఆ అలక్ష్యం నెరవేరడం లేదన్నారు.


మీరు ఇక్కడ ఉండడం వల్ల తెలంగాణ లో బాగుందని అనుకుంటే లాభం లేదని.. మేము మిమ్మల్ని ఇక్కడ పార్టీ చందాలు అడగడనికో, ఓట్ల కోసమో కలవడానికి రాలేదని.... తెలంగాణ తెచ్చుకున్న మనం తెలంగాణ లక్ష్యాలు సాధిస్తునామా అని కూడా పరిశీలించాలని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.  తెలంగాణలో పరిస్థితులు ఏమాత్రం బాగా లేవన్న రేవంత్ రెడ్డి..  కేసీఆర్ కుటుంబం చేతిలో తెలంగాణ బందీ అయ్యిందని... కేసీఆర్, కొడుకు, అల్లుడు, బిడ్డ, సడ్డకుడి కొడుకు, బంధువులు, చుట్టాలు వేల కోట్ల రూపాయలు సంపాదించి తెలంగాణ ను బందీ చేశారని ఆరోపించారు.


తెలంగాణ ప్రజలకు అప్పులు, ఆత్మహత్యలు మిగిలాయన్న రేవంత్ రెడ్డి.. ఉద్యోగాలు లేవు.. సకాలంలో జీతాలు లేవు.. ముసలోళ్ళకు పెన్షన్లు లేవని అంటున్నారు.  60 ఏళ్ళు తెలంగాణలో అన్ని వనరులు అభివృద్ధి చేస్తే కేసీఆర్ కుటుంబం అన్నింటినీ దోచుకున్నదని... కేసీఆర్ కుటుంబం బందీఖానా  నుంచి తెలంగాణ ను విడిపించాలని రేవంత్ రెడ్డి అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: