ఆంధ్రప్రదేశ్ సీఎం శ్రీ జగన్ మోహన్ రెడ్డి మరో మంచి నిర్ణయం తీసుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన శ్రీ వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ప్రజల కోసం ఎన్నో రకాల మంచి మంచి పథకాలను ప్రవేశపెడుతున్నారు. అయితే అవి కొంతమందికి ఉపయోగకరంగా ఉంటే కొంతమంది మాత్రం చాలా విమర్శిస్తున్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి నిరుపేదలకు అండగా ఉంటూ పెన్షన్‌ పథకాలను విడుదల చేస్తున్నారు.ఇక అలాగే రాష్ట్రంలో కొత్తగా మరో 3 లక్షల 98 మందికి సామాజిక పెన్షన్‌ ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేయడం జరిగింది. ఇంకా అలాగే గత ఏడాది డిసెంబర్‌ నెలలోనూ 1.50 లక్షల మందికి కొత్తగా పింఛన్లు మంజూరు చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.ఇంకా ఆ తర్వాత డిసెంబర్‌ 1 వ తేదీ నుంచి ఈ సంవత్సరం జూన్‌ 15వ తేదీ మధ్య పింఛన్ల కోసం దరఖాస్తులు అందగా, వాటిని జూన్‌ 15-23 తేదీల మధ్య రెండు విడతలుగా కూడా పరిశీలిన జరిగింది. ఇక ఇందులో భాగంగా దాదాపు 3 లక్షల మంది పెన్షన్‌కు అర్హులని తేల్చింది జగన్‌ మోహన్ రెడ్డి ప్రభుత్వం.


ఇంకా అలాగే కొత్తగా పింఛన్లు మంజూరైన లబ్ధిదారులందరికీ జూలై 19న పింఛను మంజూరు పత్రంతోపాటు పింఛన్‌ కార్డు ఇంకా పాస్‌బుక్‌లను అందించనున్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు.అలాగే అర్హులైన వారికి పెన్షన్‌ అందించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత దాదాపు 20 లక్షల మందికి కొత్తగా పింఛన్లను మంజూరు చేసినట్లు అధికారులు తెలిపడం జరిగింది.ఇంకా అలాగే నవరత్నాల్లో భాగంగా వివిధ పథకాలతో పాటు వైఎస్‌ ఆర్‌ పింఛన్‌ కానుకను కూడా అమలు చేస్తున్నారు. దీనికి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా పథకాలు చేరేలా చూడాలని సీఎం జగన్‌ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: