ఒక్కో రాష్ట్రంలో ఒక్కో కేంద్రాన్ని ఎంపిక చేసుకుని ఎన్నికలు జరపడానికి కాంగ్రెస్ అధినాయకత్వం నిర్ణయించింది. అందులో భాగంగా తెలుగు రాష్ట్రం అయిన ఆంధ్ర ప్రదేశ్ లో కర్నూల్ కేంద్రంగా ఈ ఎన్నిక జరగబోతోంది. ఈ రాష్ట్రంలో మొత్తం 350 మంది పిసిసి సభ్యులు ఉన్నారు. వీరు తమ ఓటును కాబోయే పిసిసి ప్రెసిడెంట్ కు వేసే అధికారాన్ని కలిగి ఉంటారు. ఈ ఓటును వినియోగించుకోవడంలో మెగాస్టార్ చిరంజీవికి కూడా అవకాశం ఉంది. ఈయన పశ్చిమ గోదావరి జిల్లా నుండి పిసిసి డెలిగేట్ గా ఎంపికయ్యారు. దీనితో ఇవ్వాళ జరగనున్న ఈ ఎన్నికలు చిరంజీవి కర్నూల్ వెళతారా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారనుంది.
అయితే రాజకీయాలకు కొంచెం దూరంగానే ఉన్న చిరంజీవి ఇవాళ ఓటు వేస్తారా అని అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.. ఈ విషయంపైన అటు కాంగ్రెస్ పార్టీతో పాటు, జనసేన నాయకులు కూడా ఒక కన్ను వేశారు. ఒకవేళ ఓటు వేస్తే కాంగ్రెస్ లో ఉన్నానని ప్రజలకు డైరెక్ట్ గా తెలియచేసినట్లే అవుతుంది. ఇక ఈ మధ్య చిరంజీవి జనసెన లోకి వస్తారు అన్న మాటలకు అడుకట్ట పడ్డట్లే ..మరి ఏమి జరుగుతుంది అన్నది చూడాలి.