అందుకే ఈ దుర్ఘటన చోటు చేసుకుందని కొందరు తమ అభిప్రాయాలను తెలియచేశారు. అయితే ఈ సంఘటనను మరువకముందే గుంటూరు సభలో మరో ఘోరం జరగడం రాష్ట్ర ప్రజలను తీవ్ర దిగ్బ్రాంతికి లోనయ్యేలా చేసింది. ఈ సభలో మరో ముగ్గురు మహిళలు తమ ప్రాణాలను కోల్పోయారు. దేనితో విషయం పెద్దదైంది, చంద్రబాబు సభకు వెళ్తే మృత్యు కోరల్లో చిక్కుకున్నట్టే అని అధికార పార్టీ విమర్శలు చేయడం స్టార్ట్ చేసింది. ఇక ప్రజలు మరియు సీనియర్ రాజకీయ ప్రముఖులు అంత ఇరుకైన రోడ్ లలో సభలు నిర్వహించడానికి ప్రభుత్వం ఎందుకు అనుమతి ఇచ్చిందని అనడంతో ప్రభుత్వం జీవో 1 ను తీసుకువచ్చి... ఇకపై ఏ సభ నిర్వహించాలన్న ఖచ్చితంగా అనుమతి తీసుకోవాలని... ఆ ప్రదేశం అన్ని విధాలుగా ఓకే అయితేనే ప్రభుత్వం అనుమతి ఇస్తుందని దాని సారాంశం.
ఈ జీవో పై ప్రభుత్వ వ్యతిరేక నాయకులు మరియు పార్టీలు వ్యతిరేకంగా గళం విప్పారు. కానీ జనసేనలో పనిచేసిన మాజీ సిబిఐ జెడ్ లక్ష్మీనారాయణ మాత్రం జగన్ తీసుకువచ్చిన కొత్త జీవో ను సమర్ధించారు. లక్ష్మీనారాయణ పార్టీ మరియు వ్యక్తితో సంబంధం లేకుండా మంచి చేస్తే ఎవరినైనా సమర్ధించే మనిషి. అందుకే కొత్త జీప్ పట్ల సానుకూలంగా మాట్లాడారు. కానీ ఈ వ్యాఖ్యలపట్ల టీడీపీ, జనసేన లు షాక్ అవుతున్నాయి.