బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ తీర్పు పై కార్యాచరణ ఖరారుకు ఈ నెల 29న మరోమారు సమావేశం కావాలని తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో భేటీ అయిన ఉపసంఘం ట్రైబ్యునల్ తీర్పు సంబంధిత అంశాలపై ప్రాథమికంగా చర్చించింది. ట్రైబ్యునల్ తీర్పుపై సుప్రీంకోర్టుకు అప్పీల్ కు వెళ్తే వచ్చే ప్రయోజనాలపై సమావేశంలో చర్చ జరిగింది. న్యాయపరమైన అంశాలను పూర్తి స్థాయిలో చర్చించేందుకు వీలుగా సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది వైద్యనాథన్ సలహాలు తీసుకోనుంది.