మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (ఎంఈఐఎల్)...పరిచయం అవసరం లేని పేరు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టినది ఈ సంస్థే. ఆంధ్రప్రదేశ్లోనూ ప్రముఖ నిర్మాణాలు చేపట్టింది. తాజాగా ఇంకో కీలక నిర్ణయం తీసుకుంది. ఓ ప్రతిష్ఠాత్మక ప్రణాళికతో తమ హైడ్రో కార్బన్ విభాగం విస్తరణకు సిద్ధమైంది. ఇప్పటికే వివిధ రకాల వినియోగదారులకు పైప్డ్ నేచురల్ గ్యాస్ (పీఎన్జీ), కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్జీ)ను మేఘా సరఫరా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో
జిల్లా గ్యాస్ పంపిణీ వ్యవస్థను బలోపేతం చేసుకోవడంపై సంస్థ దృష్టి సారించింది. ఇందులో భాగంగానే
తెలంగాణ,
ఆంధ్రప్రదేశ్,
కర్ణాటక రాష్ట్రాల్లోని 16 జిల్లాల్లో గ్యాస్ను విక్రయించాలనే లక్ష్యంతో ముందుకెళ్తోంది. ఇందుకోసం పెట్రోలియం అండ్ సహజ వాయువు నియంత్రణ బోర్డు (పీఎన్జీఆర్బీ) ఆమోదాన్ని కూడా పొందింది.
ఎంఈఐఎల్ రాబోయే రోజుల్లో
తెలంగాణ,
ఏపీ,
కర్ణాటక వ్యాప్తంగా దాదాపు 5 వేల కిలోమీటర్ల లైన్ను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నది. ఇప్పటికే 1,200 కిలోమీటర్ల పైప్లైన్ను నిర్మించింది. గ్యాస్ సరఫరా ప్రధానంగా రెండు విధాలుగా జరుగుతుందని, పైప్లైన్ ద్వారా పీఎన్జీ వినియోగదారులకు అందితే, లారీ, రైలు ట్యాంకర్ల ద్వారా
సీఎన్జీ రవాణా అవుతుందని మేఘా ఉపాధ్యక్షుడు పీ రాజేశ్ రెడ్డి తెలిపారు. ఈ క్రమంలోనే పీఎన్జీ సరఫరా కోసం పైప్లైన్ను విస్తరిస్తున్నామని చెప్పారు.
రెండు తెలుగు రాష్ర్టాల్లో గ్యాస్ గ్రిడ్ నెట్వర్క్స్ అభివృద్ధి కోసం మేఘా వ్యూహాత్మకంగా వ్యవహరించింది. నాగాయలంక, పశ్చిమ
పెనుగొండ ప్రాంతాల్లో ఓఎన్జీసీ నుంచి సముద్రతీర గ్యాస్ క్షేత్రాలను సాధించుకున్నది. ఈ క్షేత్రాల నుంచి రోజుకు సుమారు 1.30 లక్షల స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల (ఎస్సీఎం) గ్యాస్ను తరలించనున్నారు. దీనికి తగ్గట్లుగానే
అమెరికా నుంచి భారీ ఎత్తున సాంకేతికతనూ మేఘా దిగుమతి చేసుకున్నది. మెకానికల్ రిఫ్రిజిరేషన్ యూనిట్ల ఏర్పాటుతోపాటు కంప్రెషర్లు, ఇతర మెకానికల్ ప్యాకేజీలను సమకూర్చుకున్నది. నాగాయలంక క్షేత్రం నుంచి ఇప్పటికే
కృష్ణా జిల్లా పీఎన్జీ వినియోగదారులకు గ్యాస్ సరఫరా అవుతున్నదని రాజేశ్ రెడ్డి చెప్పారు. ఇక గెయిల్ ద్వారా కూడా వివిధ రకాలుగా రోజుకు 40 వేల ఎస్సీఎం సహజ వాయువును మేఘా అందుకుంటున్నది.
తెలంగాణలో
భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం,
వరంగల్ అర్బన్,
వరంగల్ రూరల్, జనగామ, జయశంకర్ భూపాలపల్లి,
మహబూబాబాద్,
మేడ్చల్,
రంగారెడ్డి, వికారాబాద్,
నల్గొండ,
సూర్యాపేట,
యాదాద్రి భువనగిరి జిల్లాలకు మేఘా గ్యాస్ అందుబాటులోకి రానున్నది. దీంతో ఈ జిల్లాల్లో పనులు ప్రారంభించనున్నది. ఇప్పటికే
యాదాద్రి భువనగిరి,
వరంగల్ రూరల్ జిల్లాల్లో 12 కిలోమీటర్ల పైప్ లైన్ వేశారు. మరో మూడు నెలల్లో ఈ పైప్లైన్ నెట్వర్క్ను విస్తరించనున్నారు. వీలైనంత త్వరగా గ్యాస్ సరఫరాను ప్రారంభించాలన్న లక్ష్యంతో మేఘా కదులుతోంది.