ప్రస్తుతం దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలలో బర్డ్ ఫ్లూ శరవేగంగా విస్తరిస్తూ ఎన్నో కోళ్లు, పక్షులు చనిపోతున్నాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎన్నో రాష్ట్రాలు కోళ్లు, గుడ్లకు కూడా దూరంగా ఉంటున్నారు. అంతేకాకుండా కోళ్లు, గుడ్లు పై నిషేధం కూడా విధిస్తున్నాయి కొన్ని రాష్ట్రాలు. ఈ క్రమంలోనే చికెన్ మాంసానికి భారీగా డిమాండ్ తగ్గిపోయింది. బర్డ్ ఫ్లూ నేపథ్యంలో అటు మాంసం ప్రియులు ఎక్కువగా చికెన్ కొనుగోలు చేయడానికి కాకుండా మటన్ తినడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే మార్కెట్లో మటన్ కి భారీగా డిమాండ్ పెరిగిపోయింది.
ముఖ్యంగా ఈ పండుగ సీజన్లో తెలుగు రాష్ట్రాల్లో అయితే మటన్ కి గిరాకి పెరిగిపోవడంతో ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి అని చెప్పాలి. కొన్ని రోజుల నుంచి మేక, గొర్రె మాంసం తినడానికి ఎక్కువగా ప్రజలు మొగ్గు చూపుతున్నారు. దీంతో మటన్ ధర అమాంతం పెరిగిపోయింది. కేవలం నెలరోజుల వ్యవధిలోనే మటన్ ధర 600 రూపాయల నుంచి 750 రూపాయలు వరకు వెళ్ళింది. ఇక కొన్ని ప్రాంతాలలో అయితే మటన్ కిలో ధర వెయ్యి రూపాయల వరకు పలికినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కనుమ పండుగ రోజు అయితే హైదరాబాదులో మూడు లక్షల కిలోల మాంసం విక్రయించినట్లు తెలుస్తోంది. భారీగా పెరిగిన మటన్ ధరలు ప్రస్తుతం సామాన్యులను బెంబేలెత్తిస్తున్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి