సాధారణం గా డబ్బున్న వారు ఎక్కువగా విమాన ప్రయాణాలు చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. కానీ సామాన్య మధ్య తరగతి ప్రజలు మాత్రం విమాన ప్రయాణాలు చేయడానికి ఇష్ట పడుతూ ఉంటారు కానీ అది సాధ్యం కాని విషయం అన్న విషయం తెలిసిందే.  కానీ ఈ మధ్య కాలం లో మాత్రం కొన్ని విమానయాన సంస్థలు పేదవాడికి విమానం ఎక్కాలనే కల నెరవేరాలి అనే ఉద్దేశం తో..  ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటిస్తున్నాయి అతి తక్కువ ధరకు విమాన టికెట్లు అందిస్తున్నాయి అనే విషయం తెలిసిందే.



 ఒకవేళ మీరు విమాన ప్రయాణం చేయాలని భావిస్తూ ఉంటే మీ కోసం ఒక అదిరి పోయే ఆఫర్ అందుబాటు లో ఉంది.  అతి తక్కువ ధరకు విమాన టికెట్లు పొందేందుకు అవకాశం ఉంది. ప్రముఖ విమానయాన సంస్థ గోఎయిర్ తాజాగా టికెట్ ధర లో ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్ తీసుకువచ్చింది. ఇక ఈ బంపర్ ఆఫర్ తో సామాన్యుడి కల నెరవేరేలా కనిపిస్తోంది.  ప్రయాణికులు రిపబ్లిక్ డే ఫ్రీడం  సేల్  టికెట్ ధర తగ్గింపు ఆఫర్లో భాగంగా కేవలం 859 రూపాయల నుంచి విమానం టికెట్ ధర ప్రారంభమవుతుంది. అయితే ఇది కేవలం పరిమిత కాలం ఆఫర్ మాత్రమే.


 జనవరి 22 నుంచి ఈ ఆఫర్ అందుబాటులోకి వచ్చింది. జనవరి 29 వరకు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది అనేది మాత్రం అందరూ తప్పక గుర్తుంచుకోవాలి. ఇక ఈ ఆఫర్లో భాగంగా విమాన టికెట్లు బుక్ చేసుకున్న వారు ఏప్రిల్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు ఎప్పుడైనా విమాన ప్రయాణం చేసేందుకు అవకాశం ఉంది. కేవలం ఒక వైపు ప్రయాణించేందుకు  మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఇక విమానం బయలుదేరే 15 రోజుల ముందు కూడా షెడ్యూల్ మార్చుకోవడానికి వీలు ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: