
అంతేకాకుండా గుండె సమస్యలను కూడా అదుపులో ఉంచుతుంది. కంటి కింద నల్లని వలయాలు ఏర్పడిన వారు ఈ కూర తినడం వలన కంటి కింద నల్లటి మచ్చలు తగ్గుముఖం పడతాయి.ఈ ఆకు తింటే కంటి సమస్యలు ఏర్పడవు. ఆ పొన్నగంటి ఆకును పప్పు, పచ్చడి, ఇంకా వివిధ రకాల వంటలు చేసుకోవడానికి ఉపయోగిస్తారు. ఇంకా ఈ కూరను వేపుడు కంటే ఉడికించి తీసుకోవడం వల్ల చాలా ఎక్కువ లాభాలు ఉంటాయి. అంతే కాకుండా ఈ కూర తినడం వల్ల నోటి దుర్వాసన తొలగుతుంది. ఇందులో విటమిన్ బి, విటమిన్ సి ఉంటాయి. ఈ ఆకును శుభ్రంగా కడిగి, తరిగీ కాస్త పెసరపప్పు, ఉల్లిపాయలు, జీలకర్ర, వెల్లుల్లి, మిరియాల పొడి కాస్త నూనె జోడించి ఉడికించి తీసుకోవడం వల్ల రక్త శుద్ధి జరుగుతుంది.
బరువు తగ్గాలి అనుకున్నవారు ఈ కూరను ఉడికించి ఉప్పు, మిరియాల పొడి కలిపి తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారు అని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.బరువు పెరగాలి అనుకునేవారు కందిపప్పు తో ఈ ఆకును వండి, నెయ్యి కలిపి తీసుకోవడం వల్ల బరువు పెరుగుతారు. ఈ ఆకు సహజమైన చర్మ కాంతిని ఇస్తుంది.మంచి పోషకవిలువలు ఉన్న ఈ ఆకుకూర వారానికి కనీసం రెండు సార్లు తీసుకోవడం వల్ల కంటిసమస్య నుంచి బయట పడవచ్చు. ఈ ఆకును పప్పుతో కన్నా ఉడికించి తీసుకోవడం వల్ల ప్రయోజనం ఎక్కువ.ఈ కూరను పదేపదే వేడి చేసి తినడం వల్ల వికారానికి దారి తీసే ప్రమాదం ఉంది.