అది అలా ఉంటే ఇప్పుడు గృహ నిర్మాణాల విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై ఆగ్రహం పెరిగిపోతున్నది. చాలామంది కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తే ఇల్లు కట్టుకుందామని ఎదురుచూస్తున్నా సరే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రావడం లేదు. దీని వలన మధ్యతరగతి ప్రజల్లో ఆందోళన మొదలైంది. గతంలో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులు ఇచ్చింది. కానీ ఇప్పుడు మాత్రం అలాంటి పరిస్థితి కనబడడం లేదు. దీనితో మధ్యతరగతి ప్రజల్లో కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం పెరిగిపోతుందని అంటున్నారు. రాజకీయంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది ఎంతమాత్రం కూడా మంచిది కాదు. మధ్య తరగతి ప్రజలు... ఇప్పటికే ధరల పెంపుదల పెట్రోల్ డీజిల్ ధరల విషయంలో వెనకా ముందు ఆలోచించకుండా పెంచడం పై ఆగ్రహంగా ఉన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇళ్ల నిర్మాణాలు విషయంలో జాగ్రత్తగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది.
ఇక ప్రజల వద్ద నుంచి భారీగా వసూలు చేస్తున్నారనే ఆరోపణలు కూడా ఎక్కువగా వినబడుతున్నాయి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం జాగ్రత్తగా ముందుకు వెళ్లకపోతే సమస్యలు ఎదురు కావచ్చు. నిర్మాణాల విషయంలో పేదల్లో కూడా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ వాస్తవాలు ప్రధానికి తెలియడం లేదని కూడా కొంతమంది అంటున్నారు.