అయితే ఒకవేళ మీకు అతి పెద్ద ప్రభుత్వ రంగ బీమా సంస్థ అయినా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లో ఉద్యోగులుగా కానీ కస్టమర్లుగా కానీ ఉంటే ఈ వార్త మీకోసమే. ఎల్ఐసి ఉద్యోగులకు రెండు గుడ్ న్యూస్ లు అందించింది సంస్థ. అంతేకాకుండా పాలసీదారులు కూడా ఒక విషయాన్ని గుర్తు పెట్టుకోవాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల కీలక నిర్ణయం తీసుకుని 1.14 లక్షల మంది ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. కేవలం వారానికి ఐదు రోజులు మాత్రమే పని దినాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ క్రమంలోనే ఇకనుంచి ఎల్ ఐ సి ఎంప్లాయిస్ అందరూ కూడా వారంలో రెండు రోజుల పాటు సెలవులో ఉండనున్నారు. ఇది అటు ఎల్ఐసి ఉద్యోగులందరికీ గొప్ప శుభవార్త అనే చెప్పాలి.
అదే సమయంలో అటు ఎల్ఐసి పాలసీ దారులు కూడా ఈ విషయాన్ని తప్పక గుర్తుంచుకోవాలి శనివారం ఎల్ఐసి ఆఫీస్ ఉండదు అన్న విషయాన్ని గమనించాలి సోమవారం నుంచి శుక్రవారం వరకు మాత్రమే కస్టమర్లు వారి పనులు పూర్తి చేసుకోవడానికి ఎల్ఐసి ఆఫీస్ను సంప్రదించే అవకాశం ఉంది అని అందరు గమనించాలి. అయితే ఎల్ఐసి ఉద్యోగులకు కేవలం వారానికి ఐదు రోజులు మాత్రమే పని దినాలను ఉండేలా నిర్ణయం తీసుకోవడమే కాదు ఇక ఉద్యోగులందరికీ కూడా 25 శాతం మేర వేతన పెంపుకు కూడా కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి