పెళ్లి అంటే బంధుమిత్రుల సమక్షం లో అంగరంగ వైభవంగా జరుగుతుంది.  తెలియని చుట్టాలు తెలిసిన చుట్టాలు అందరూ వచ్చి నూతన వధూ వరులకు ఆశీర్వచనాలు అందిస్తూ వుంటారు.  కానీ ప్రస్తుతం కరోనా వైరస్ సమయం లో పెళ్లిళ్లు ఇంత ఘనంగా జరగడం లేదు కానీ.. కొంతమంది బంధుమిత్రుల సమక్షం లో తూతూ మంత్రంగా జరిగిపోతున్నాయి.  ఇక కొన్ని ప్రాంతాలలో ఎక్కువగా కరోనా నిబంధనలు అమలు లేకపోవడంతో కాస్త ఘనంగానే పెళ్లిళ్లు జరుపుకుంటున్నారు.  అయితే ఇక కొన్ని కొన్ని సార్లు పెళ్లి జరిగిన సమయంలో ఇక పెళ్లి వేదికపై ఆసక్తికర ఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి.



 ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. ఇది కాస్త ప్రస్తుతం అందరినీ అవాక్కయ్యేలా చేసింది. అయితే ఇక ఇది చూస్తున్న వారినే కాదు... అక్కడ ఉన్న పెళ్లి కొడుకును కూడా ఈ ఘటన అవాక్కయ్యేలా చేసింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే ఇప్పటి వరకు జరిగిన పెళ్లిళ్లలో పెళ్ళికొడుకు పెళ్ళికూతురు కి లేదా పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కి అందరి ముందే స్టేజ్ పై ముద్దు పెట్టడం లాంటి ఘటనలు పలుమార్లు తెర మీదికి వచ్చాయి.  ఇటీవలి కాలంలో ఇదంతా సర్వసాధారణంగా మారిపోయిందనుకోండి.



 కానీ ఇక్కడ జరిగిన ఘటన మాత్రం సోషల్ మీడియాలో సంచలనంగా మారిపోయింది. ఇటీవలే వివాహం జరిగిన తర్వాత రిసెప్షన్ నిర్వహించారు  ఇక రిసెప్షన్ లో పెళ్ళికొడుకు పెళ్ళికూతురు కుర్చీలో కూర్చోని ఉండగా.. ఇక పెళ్ళి కొడుకు దగ్గరకు వచ్చి అతని మరదలు పక్కనే కూర్చుని ఫోటో దిగింది. అంతటితో ఊరుకోకుండా ఏకంగా పెళ్లి కొడుకుకి అందరిముందే లిప్ కిస్ ఇచ్చింది. దీంతో పెళ్ళికొడుకు ఒక్కసారిగా అవాక్కయ్యాడు. ఇది ఎక్కడ జరిగిందో తెలియదు కానీ..  దీనికి సంబంధించిన వీడియో మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: