డిసెంబల్ 3వ తేదీకి వాయుగుండం కాస్తా తుపానుగా మారుతుందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ తుపానుకు జవాద్ అని పేరు పెట్టారు అధికారులు. ఈ నెల 5, 6వ తేదీల్లో కళింగపట్నం, పారాదీప్ మధ్యలో జవాద్ తీరం దాటే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. అయితే జవాద్ ప్రభావం అధికంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపైనే ఉంటుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విశాఖ,విజయనగరం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయంటున్నారు. ఇక నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు అధికారులు. మత్య్సకారులు మరో వారం రోజుల పాటు సముద్రంలో వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించాలని ఏపీ ప్రభుత్వం ఇప్పటికే అధికారులను ఆదేశించింది.
డిసెంబల్ 3వ తేదీకి వాయుగుండం కాస్తా తుపానుగా మారుతుందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ తుపానుకు జవాద్ అని పేరు పెట్టారు అధికారులు. ఈ నెల 5, 6వ తేదీల్లో కళింగపట్నం, పారాదీప్ మధ్యలో జవాద్ తీరం దాటే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. అయితే జవాద్ ప్రభావం అధికంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపైనే ఉంటుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విశాఖ,విజయనగరం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయంటున్నారు. ఇక నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు అధికారులు. మత్య్సకారులు మరో వారం రోజుల పాటు సముద్రంలో వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించాలని ఏపీ ప్రభుత్వం ఇప్పటికే అధికారులను ఆదేశించింది.