పిల్లల్లో అక్షరాస్యతా శాతం పెంచేందుకు అమ్మ ఒడి పేరుతో నేరుగా విద్యార్థుల తల్లులు లేదా సంరక్షకుల ఖాతాల్లోనే ప్రభుత్వం నగదు జమ చేస్తుంది. అయితే ఈ పథకాన్ని ఇప్పుడు దేశ వ్యాప్తంగా అమలు చేయాలని జగన్ సర్కార్ కేంద్రాన్ని కోరింది. ఇందుకు అనుగుణంగా రాజ్యసభలో ప్రైవేటు బిల్లు కూడా ప్రవేశ పెట్టారు వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి. జగన్ తన అజెండాలోని అంశాల్ని... మోదీ సర్కార్ దేశ వ్యాప్తంగా అమలు చేయాలని కోరడం ఎందుకు అనే ప్రశ్నలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జోరుగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ప్రైవేటు బిల్లును రాజ్యసభ ఆమోదం తెలిపితే... ఈ పథకం అమలుకు కేంద్రం చర్యలు ప్రారంభించాలి. ఇలా జరిగితే... రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థిక భారం తగ్గుతుంది. అయితే గతంలో రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఏ పథకం కూడా దేశ వ్యాప్తంగా అమలు జరిగిన దాఖలాలు లేవు. అటు ప్రాంతీయ పార్టీలు కూడా తమ పథకాలను దేశ వ్యాప్తంగా అమలు చేయాలని కేంద్రాన్ని కోరలేదు. గతంలో వైఎస్ఆర్ ప్రవేశ పెట్టిన ఆరోగ్య శ్రీ పథకం కూడా... అంతకు ముందు కర్ణాటకలో యశస్వీ పేరుతో అమలులో ఉన్నదే. ఇలాంటి సమయంలో వైసీపీ తాజాగా ఈ డిమాండ్ ఎందుకు తెరపైకి తీసుకువచ్చిందనే చర్చ సొంత పార్టీలోనే జోరుగా సాగుతోంది.
పిల్లల్లో అక్షరాస్యతా శాతం పెంచేందుకు అమ్మ ఒడి పేరుతో నేరుగా విద్యార్థుల తల్లులు లేదా సంరక్షకుల ఖాతాల్లోనే ప్రభుత్వం నగదు జమ చేస్తుంది. అయితే ఈ పథకాన్ని ఇప్పుడు దేశ వ్యాప్తంగా అమలు చేయాలని జగన్ సర్కార్ కేంద్రాన్ని కోరింది. ఇందుకు అనుగుణంగా రాజ్యసభలో ప్రైవేటు బిల్లు కూడా ప్రవేశ పెట్టారు వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి. జగన్ తన అజెండాలోని అంశాల్ని... మోదీ సర్కార్ దేశ వ్యాప్తంగా అమలు చేయాలని కోరడం ఎందుకు అనే ప్రశ్నలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జోరుగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ప్రైవేటు బిల్లును రాజ్యసభ ఆమోదం తెలిపితే... ఈ పథకం అమలుకు కేంద్రం చర్యలు ప్రారంభించాలి. ఇలా జరిగితే... రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థిక భారం తగ్గుతుంది. అయితే గతంలో రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఏ పథకం కూడా దేశ వ్యాప్తంగా అమలు జరిగిన దాఖలాలు లేవు. అటు ప్రాంతీయ పార్టీలు కూడా తమ పథకాలను దేశ వ్యాప్తంగా అమలు చేయాలని కేంద్రాన్ని కోరలేదు. గతంలో వైఎస్ఆర్ ప్రవేశ పెట్టిన ఆరోగ్య శ్రీ పథకం కూడా... అంతకు ముందు కర్ణాటకలో యశస్వీ పేరుతో అమలులో ఉన్నదే. ఇలాంటి సమయంలో వైసీపీ తాజాగా ఈ డిమాండ్ ఎందుకు తెరపైకి తీసుకువచ్చిందనే చర్చ సొంత పార్టీలోనే జోరుగా సాగుతోంది.