లింగమనేని రమేష్..మామూలు జనాలకు పెద్దగా పరిచయటం లేకపోవచ్చు. కానీ రాజకీయ వర్గాల్లో మాత్రం చాలా పాపులర్. అందులోను తెలుగుదేశంపార్టీ, జనసేన వర్గాల్లో అయితే వీవీఐపీ స్టేటస్ ఉన్న వ్యక్తనే చెప్పాలి. దీనికి కారణం ఏమిటంటే ఇటు చంద్రబాబునాయుడుకు అటు పవన్ కల్యాణ్ కు అత్యంత సన్నిహితుడు. పైగా పవన్ కు ఫైనాన్షియర్ అనే ప్రచారం కూడా ఉంది. చంద్రబాబు-పవన్ కు అనుసంధాన కర్త లింగమనేనే అనే ప్రచారం విపరీతంగా ఉంది.





కరకట్టమీద చంద్రబాబు నివాసం ఉంటున్న అక్రమ నిర్మాణం సొంతదారు లింగమనేనే. కృష్ణానది కరకట్టమీద ఉన్న అక్రమ నిర్మాణంపై చంద్రబాబు మనసు పారేసుకోగానే అంతటి విశాలమైన భవనాన్ని లింగమనేని అలా సింపుల్ గా ఇచ్చేశారు. వేలచదరపు అడుగుల విస్తీర్ణంలో ఎంతో ముచ్చటపడి కృష్ణానది ఒడ్డున నిర్మించుకున్న అక్రమ నిర్మాణాన్ని ఎవరైనా అడగ్గానే ఎవరైనా అలా సింపుల్ గా ఇచ్చేస్తారా ? చంద్రబాబుతో ఎంతటి సాన్నిహిత్యంతో లేకపోతే లింగమనేని తన సువిశాల భవనాన్ని ఇచ్చేస్తారు ?





ఇక జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో కూడా ఇలాంటి సాన్నిహిత్యమే ఉందట. మంగళగిరిలో పవన్ నిర్మించిన జనసేన కేంద్ర కార్యాలయం లింగమనేని స్ధలమే అనే ప్రచారం అందరికీ తెలిసిందే. అంటే ఇటు చంద్రబాబుతో పాటు అటు పవన్ తో లింగమనేనికి ఎంతటి ఫెవికాల్ లాంటి  అనుబంధముందో అర్ధమైపోతోంది. రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రభుత్వం చేసిన భూసమీకరణ మొత్తం లింగమనేని రియల్ ఎస్టేట్ వెంచర్ కు రెండు కిలోమీటర్ల దూరంలోనే ఆగిపోయింది. అంతుకుముందు లింగమనేని రియల్ ఎస్టేట్ లో భూముల ధరలు పెద్దగా లేవట.





ఎప్పుడైతే టీడీపీ అధికారంలోకి వచ్చిందో అప్పటినుండే లింగమనేని భూములకు రెక్కలొచ్చి కోట్ల రూపాయలకు చేరుకుందనే ఆరోపణలు అందరికీ తెలిసిందే. అమరావతి మాస్టర్ ప్లాన్ సరిగ్గా లింగమనేని రియల్ ఎస్టేట్ వెంచర్ల సమీపానికి వచ్చి ఎందుకు ఆగిపోయిందో అందరికీ తెలిసిందే. ఇక్కడే లింగమనేని-చంద్రబాబు మధ్య క్విడ్ ప్రోకో జరిగిందని అప్పట్లో వైసీపీ నేతలు చాలా ఆరోపణలే చేశారు. అలాంటిది ఇపుడు అమరావతి భూసమీకరణ  అక్రమాల్లో లింగమనేని రమేష్ ఏ 3 గా ఉండటం గమనార్హం. మరి చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: