సాఫ్ట్ వేర్ ఉద్యోగం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.చదివిన చదువుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ చేసే జాబ్. ఈ జాబ్ చెయ్యాలని చాలా మంది కలలు కంటుంటారు. దానికి కారణం  మంచి జీతం. కానీ పని ఒత్తిడి కూడా ఎక్కువగానే ఉంటుంది. అయితే జీతానికి తగ్గట్టు ఒత్తిడి కూడా ఎక్కువగానే ఉంటుంది. కొన్నిసార్లు ఆ ఒత్తిడిని తట్టుకోలేక చాలా మంది ఆత్మహత్య చేసుకున్న ఘటనలు ఎక్కువగా వున్నాయి.ఇప్పుడు తాజాగా మరో వ్యక్తి కూడా ఆత్మహత్య చేసుకోవడం చాలా కలకలం రేపుతోంది. చేసే పనిలో ఒత్తిడి అలాగే ఉద్యోగ భద్రత కూడా లేకపోవడంతో ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. హైదరాబాద్ నగర శివారు నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధి అల్కాపూర్ టౌన్ షిప్ లో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.


పూర్తి వివరాల్లోకి వెళ్తే గుంటూరుకి చెందిన వినోద్ కుమార్ (32) ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఇప్పటి దాకా వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా గుంటూరు నుంచే అతను పని చేశాడు. కానీ ఈ మధ్య ఆఫిస్ కు వెళ్లి రావాల్సి ఉండటంతో అల్కాపూర్ లోని తన సోదరుని ఇంట్లో ఉంటూ ఆఫీసుకి పనికి వెళ్తున్నాడు.అయితే ఆఫీసులో ఉద్యోగ నిర్వహణలో భాగంగా కొత్త టూల్స్ వస్తుండటంతో వినోద్ వాటిపై అంతగా పట్టు సాధించలేకపోయాడు. ఈ విషయంపై తన సోదరుడితో కూడా అతను తరచూ చర్చించేవాడు. తాను చేసే ఉద్యోగంలో పని ఒత్తడి ఇంకా ఉద్యోగ భద్రత కూడా లేదని భావించిన వినోద్ గురువారం నాడు సోదరుడు అతని భార్య బయటకు వెళ్లటంతో ఆ ఇంట్లో ఉరివేసుకున్నాడు. ఇక ఈ తర్వాత ఇంటికి వచ్చిన సోదరుడు వినోద్ ను ఆసుపత్రికి తరలించినా కూడా అప్పటికే అతను చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. ఇక పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. వినోద్ కు భార్య ఇంకా మూడేళ్ల కుమార్తె ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: