- ఓటు విలువ వారికి తెలియదా.?
- ప్రతి ఒక్కరం ఓటు వేద్దాం ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం.!
ఓటు అనేది మన రాజ్యాంగం కల్పించిన హక్కు. మన దేశ భవిష్యత్తు మార్చాలన్న దేశం అభివృద్ధి బాటలో నడవాలన్నా, నువ్వు ఎన్నుకునే నాయకున్ని బట్టే ఉంటుంది. ఆ నాయకుని ఎన్నిక కూడా నువ్వు వేసే ఓటును బట్టే డిసైడ్ అవుతుంది. అంటే ఒక్క ఓటుపై దేశ అభివృద్ధి, దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందన్నమాట. అలాంటి విలువైన ఓటును ప్రస్తుత కాలంలో చాలామంది అంగట్లో సరుకు లాగా అమ్ముకుంటున్నారు. చివరికి అనేక ఇబ్బందులు పడుతూ రాజకీయ నాయకులను ప్రశ్నించలేకపోతున్నారు. వారిచ్చే రూ:500, 1000 రూపాయలకు ఆశపడి ఐదు సంవత్సరాల పాటు వారి కింద బానిసలుగా బతుకుతున్నారనేది జగమెరిగిన సత్యం. ఇలా ఎంతో విలువ కలిగినటువంటి ఈ ఓటును అమ్ముకోకుండా మనకు అభివృద్ధి చేసే నాయకుడు ఎవరు అనేది చూసి మరి ఓటు వేయాలి. కానీ ప్రస్తుత కాలంలో అది జరగడం లేదు.