
ఇచ్చిన మాట ప్రకారం 670 మంది రైతులకు గాను వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ హెక్టార్కు 20వేల చొప్పున 670 మంది రైతులకు..1.14 కోట్ల రూపాయలు ఆర్థిక సహాయాన్ని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అందించినట్లుగా తెలియజేశారు. అధికారం లేకపోయినా అన్నదాతలకు ఇచ్చిన మాట ప్రకారం నిలబెట్టుకున్నారని వైసీపీ తమ ట్విట్టర్ ద్వారా తెలియజేసింది.. దీంతో పలువురు కార్యకర్తలు అధికార ప్రభుత్వం చేయలేని పని జగన్ చేసి చూపించారంటూ తెలియజేస్తున్నారు.
అలాగే వైసిపి అధినేత జగన్ కూడా సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గంలో అమరుడైన ఆర్మీ జవాన్ మురళి నాయక్ కుటుంబాన్ని పరామర్శించడానికి మే 13వ తేదీన వెళ్ళబోతున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం 12:30 నిమిషాలకు తిరిగి వెళ్ళబోతున్నారట. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి మురళి నాయక్ కుటుంబ సభ్యులను ఫోన్లో కూడా మాట్లాడి పరామర్శించినట్లు తెలుస్తోంది. అతని కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని కూడా తెలియజేశారు మాజీ సీఎం జగన్. మొత్తానికి జగన్ ఇచ్చిన మాట ప్రకారమే రైతులకు చేసిన సహాయం ఇప్పుడు వైరల్ గా మారుతున్నది. మరి రాబోయే రోజుల్లో ఏంటా అన్నది చూడాలి.