
దేశంలో మొదలు పెట్టే జన గణన ముందుగా వచ్చే ఏడాది అక్టోబర్ 1 అర్ధరాత్రి నుంచి కేంద్ర పాలిత ప్రాంతాలైన లడఖ్, జమ్మూ కాశ్మీర్ తో పాటు హిమాచల్ ప్రదేశ్ , ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో చేయనున్నారు .. అలాగే 2027 మార్చ్ 1 నుంచి మిగిలిన రాష్ట్రాలు , కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ ప్రక్రియ జరగనుంది .. అదే విధంగా ప్రతి రాష్ట్రం లోనూ రెండు దశల్లో జనాభా గణన చేస్తారు .. అలాగే నిన్న జన గణన కమిషన్ రిజిస్టర్ జనరల్ తో ఈ విషయం పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమీక్ష కూడా నిర్వహించారు . ఆ మీటింగ్ లో ఈ తేదీలను ఖరారు చేశారు .
జనాభా గణనలో భాగంగా ఏన్యూమరేటర్లు ఇంటింటికి వెళ్లి ముందుగా హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ చేపడతారు .. అందులో ప్రతి ఇంటి గృహ పరిస్థితులు ఆస్తులు సౌకర్యాలు గురించి ప్రతి సమాచారం తీసుకుంటారు .. ఆ తర్వాత రెండవ దశలో ప్రతి ఇంటికి వెళ్లి ప్రతి వ్యక్తి యొక్క జనాభా సామాజిక ఆర్థిక సంస్కృతిక వివరాలు తీసుకుంటారు .. ఈ దశలోనే ఆ వ్యక్తి యొక్క కులం గురించి కూడా సమాచారం తీసుకుంటారు .. మనదేశంలో ఎంతో సుదీర్ఘమైన విరామం తర్వాత ఇలా జనాభా గణన తో పాటుగా కుల గణను కూడా చేయనున్నారు .. బీహార్ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ సంచల నిర్ణయం తీసుకుంది .