
చంద్రబాబు ప్రజాప్రతినిధులకు విదేశీ పర్యటనలపై ఆంక్షలు విధించారు. తానా, ఆటాల కోసం విదేశాలకు వెళితే ఖచ్చితంగా టికెట్లు కోల్పోతారని హెచ్చరించారు. ప్రజాప్రతినిధుల పనితీరును నిశితంగా పరిశీలిస్తున్నామని, వారి గ్రాఫ్ పెరుగుతుందా, తగ్గుతుందా అని గమనిస్తున్నామని తెలిపారు. ప్రజలకు దగ్గరగా ఉండి, వారి సమస్యలను పరిష్కరించడంపై దృష్టి పెట్టాలని ఆదేశించారు.
అభివృద్ధి ద్వారానే ఆదాయం పెరుగుతుందని, దాని ద్వారా సంక్షేమ కార్యక్రమాలను మరింత బలోపేతం చేయవచ్చని చంద్రబాబు వివరించారు. గతంలో హైటెక్ సిటీ స్థాపన సమయంలో ఎకరం భూమి లక్ష రూపాయలు ఉండగా, ఇప్పుడు అది వంద కోట్లకు చేరిందని ఉదాహరణ ఇచ్చారు. ఇది అభివృద్ధి ఫలితమని, ఇలాంటి పనులు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళతాయని పేర్కొన్నారు. ప్రజలకు అభివృద్ధి పనులను వివరించి, వారి నమ్మకాన్ని చూరగొనాలని సూచించారు.
చంద్రబాబు తన 'లైవ్ 66' కార్యక్రమంలో మాట్లాడుతూ, తొలి ఏడాది 4.1 పూర్తయిందని, రెండో ఏడాది ప్రారంభమైందని తెలిపారు. ప్రజాప్రతినిధులు నిరంతరం ప్రజలతో మమేకం కావాలని, హామీల అమలును వివరించాలని ఆదేశించారు. ఎన్ని సవాళ్లు ఎదురైనా, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చామని చెప్పాలని సూచించారు. 2029 ఎన్నికల విజయం కోసం ఇప్పటి నుంచే వ్యూహాత్మకంగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.
వాట్సాప్ నెంబర్ 94905 20108 కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 94905 20108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు