
ఈ విద్యార్థులందరూ కాలేజీ హాస్టల్లో నివసిస్తున్నవారే. నిందితుల సమాచారం ఆధారంగా ఈగల్ టీమ్ ఈ కేసును లోతుగా విచారిస్తోంది. గంజాయి సరఫరా జరిగిన తీరు, దాని వెనుక ఉన్న నెట్వర్క్ను ఛేదించేందుకు పోలీసులు కసరత్తు చేస్తున్నారు.ఈ ఘటన తర్వాత మెడికోలకు తల్లిదండ్రుల సమక్షంలో ఈగల్ టీమ్ కౌన్సెలింగ్ నిర్వహించింది. గంజాయి వినియోగం నిర్ధారణ అయిన తొమ్మిది మంది విద్యార్థులను డీ-అడిక్షన్ సెంటర్కు పంపారు.
వారి రికవరీ, పునరావాసం కోసం రాబోయే 30 రోజులు కీలకంగా ఉంటాయని అధికారులు తెలిపారు. ఈ సంఘటన విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై డ్రగ్స్ ప్రభావాన్ని తెలియజేస్తుంది.ఈగల్ టీమ్ ఈ కేసును తీవ్రంగా పరిగణిస్తూ భవిష్యత్తులో విద్యా సంస్థల్లో ఆకస్మిక తనిఖీలు కొనసాగిస్తామని ప్రకటించింది. ఈ ఘటన హైదరాబాద్లో డ్రగ్స్ సమస్య తీవ్రతను బయటపెట్టింది. మెడిసిటీ కాలేజీ యాజమాన్యం ఈ విషయంపై స్పందిస్తూ, విద్యార్థులను కాపాడేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపింది.
వాట్సాప్ నెంబర్ 94905 20108 కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 94905 20108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు