తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం పండగల సీజన్ నడుస్తోంది. వరుసగా సెలవులు రావడం బస్సు, రైళ్ల ద్వారా ప్రయాణికులు ప్రయాణాలు సాగిస్తున్నారు. ఇప్పటికే ప్రయివేట్ బస్సుల చార్జీలు ఊహించని స్థాయిలో పెరగగా రైళ్లు సైతం భారీ సంఖ్యలో ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. అయితే ఎక్కువగా రైలు ప్రయాణాలు చేసే వాళ్ళ కోసం రైల్వే శాఖ అదిరిపోయే ఆఫర్ ను ప్రకటించడం గమనార్హం.

రైల్వే శాఖ రౌండ్ ట్రిప్ ప్యాకేజ్ పేరుతో  ప్రవేశపెట్టిన ఈ స్కీమ్ వల్ల ప్రయాణికులకు దీర్ఘకాలంలో ప్రయోజనాలు కలగనున్నాయి.  రౌండ్ ట్రిప్ ప్యాకేజ్ ను ఎవరైతే తీసుకుంటారో  వాళ్ళు రిటర్న్ టికెట్ పై ఏకంగా 20 శాతం డిస్కౌంట్ పొందే ఛాన్స్ అయితే ఉంటుంది.  ముందస్తు రిజర్వేషన్ ను ప్రోత్సహించాలనే మంచి ఆలోచనతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారని సమాచారం అందుతోంది.

ఆగష్టు 14వ తేదీ నుంచి ఈ ఆఫర్ అందుబాటులోకి రానుండగా  రాయితీ వర్తించే తేదీలలో టికెట్లు బుకింగ్ చేసుకుంటే మాత్రమే  ఈ బెనిఫిట్స్ పొందవచ్చు. సమీపంలోని  రైల్వే శాఖను సంప్రదించడం ద్వారా ఈ పథకానికి సంబంధించిన పూర్తి  విషయాలను తెలుసుకోవచ్చు.

ముందస్తు రిజర్వేషన్ రూల్  తో సంబంధం లేకుండా ఈ పథకం అమలవుతోంది  అయితే బుకింగ్ చేసుకున్న టికెట్స్ కన్ఫర్మ్ అయితే మాత్రమే ఈ బెనిఫిట్స్ పొందవచ్చు.  అయితే ఈ నిబంధనలను మ్యాచ్ చేస్తూ టికెట్లను బుకింగ్ చేసుకోవడం ఎంతవరకు సాధ్యమవుతుందో చూడాల్సి ఉంది. కొన్ని రోజులకే ఈ నిబంధనలను వర్తింపజేయడం ఏంటని కూడా కామెంట్లు వినిపిస్తున్నాయి.

 
వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: