కర్నూల్‌లో తాజాగా జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్తున్న "వీ  కావేరి ట్రావెల్స్" వోల్వ  బస్సు కర్నూల్ సమీపంలో ఒక బైక్‌ను ఢీకొట్టడంతో పెద్ద ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో దాదాపు 20 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు, 11 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. తీవ్రంగా గాయపడ్డవారిని వెంటనే సమీప ఆసుపత్రిలో చేర్చారు. ఈ ఘోర ఘటనపై స్పందిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా సీరియస్ అయినట్లు సమాచారం. ప్రాణాలు కోల్పోయిన ప్రతి ఒక్కరికి రెండు లక్షల రూపాయలు, గాయపడ్డవారికి 50,000 రూపాయల పరిహారం ప్రకటించారు. అంతేకాదు, ఈ ప్రమాదం అసలు ఎందుకు జరిగింది..? తప్పిదం ఎవరిది..? బస్సు వేగం.. ఓవర్‌టేక్..? లేదా బైక్ ఢీకొట్టడం కారణంగా ప్రమాదం జరిగిందా..? వంటి విషయాలపై ప్రత్యేకమైన విచారణ జరపాలని మోడీ ఆదేశాలు జారీ చేశారు. ఇది మాత్రమే కాదు, ప్రధాని మోడీ భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు మళ్లీ జరుగకుండా కొత్త రోడ్డు రూల్స్ ను తీసుకురాబోతున్నారని తెలుస్తోంది.

నరేంద్ర మోదీ ఆలోచిస్తున్న కొత్త నియమావళి ప్రకారం:

*ఏ ప్రైవేట్ బస్సు అయినా ఓవర్‌స్పీడ్ చేస్తే ఆ బస్సు రిజిస్ట్రేషన్ రద్దు చేయబడుతుంది.

*బస్సులోని సీటు కంట్రోల్ సిస్టమ్స్ అత్యధికంగా ప్రమాదకర స్థాయికి చేరకుండా ఉండాలి. హై స్పీడ్ అనుమతించే ఎక్విప్మెంట్స్ అన్ని తొలగించబడతాయి.

*ప్రతి బస్సు లో సీటు కంట్రోల్ మరియు ఇన్‌టీరియర్ సేఫ్టీ సిస్టమ్స్ అత్యంత నియంత్రిత స్థాయిలో అమర్చబడాలి, ఇంతకంటే ఎక్కువ వేగంలో ప్రయాణించడం అడ్డుకోవాలి.

*రిపోర్ట్‌ల ప్రకారం, వందకి 80% రోడ్డు ప్రమాదాలు ఎక్కువ వేగం కారణంగా జరుగుతాయని గుర్తించబడింది. ఈ కొత్త నియమాలు అమలులోకి వస్తే, భవిష్యత్తులో ఇటువంటి ఘోర ప్రమాదాల సంఖ్య గణనీయంగా తగ్గుతుందని నిపుణులు భావిస్తున్నారు.

కామన్ పీపుల్ ఎదురుచూస్తుంది దేనికోసం అంటే.. ఈ కొత్త రూల్స్ ను రియల్ టైంలో ఎలా అమలు చేయనున్నారు, మరియు వాటి ఫలితాలు రోడ్లపై ఎంతవరకు సురక్షితంగా ఉంటాయో అనేది..?

అంతేకాదు ఈ కర్నూల్ ప్రమాద ఘటనపై రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము కూడా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కర్నూలు బస్సు ప్రమాద ఘటన అత్యంత దురదృష్టకర ఘటన అని .. ఈ ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అంతేకాదు అలాగే గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని రాష్ట్రపతి ముర్ము ట్వీట్టర్ వేదికగా పోస్ట్ చేశారు.
 


మరింత సమాచారం తెలుసుకోండి: