బంగ్లాదేశ్ క్రికెటర్ షకిబుల్ హసనకు భారీ ఊరట రావడం జరిగింది. ఇటీవల బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు(బీసీబీ) నియమ నిబంధనల్ని ఉల్లంఘించిన షకిబుల్..  స్థానిక టెలికాం సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించాడు. ఇది బోర్డు నియమావళిని అతిక్రమించనట్లు కావడంతో షకిబుల్ పై చర్యలు తీసుకోవాలని బీసీబీ భావించడం జరిగింది. ఈ క్రమంలోనే బీసీబీ పంపిన షోకాజ్ నోటీసుకు పంపిన కొన్ని గంటల వ్యవధిలోనే మనసు మార్చుకోవడం జరిగింది.


ఈ విషయంపై  బీసీబీ అధ్యక్షుడు నజ్ముల్ హసన్ మాట్లాడుతూ.. ఇది బోర్డు అంతర్గత వ్యవహారం. దీనికి ఇక్కడితే ముగింపు పలకాలని అనుకుంటున్నాం. అతనిపై ఎటువంటి యాక్షన్ తీసుకోవాలని అనుకోవడం లేదు. అయితే జాతీయ కాంట్రాక్ట్ లో ఉన్న ఆటగాడు ఆ సంస్థతో ఎందుకు ఒప్పందం చేసుకున్నాడు అనే దానిపై వివరణ ఇవ్వాల్సి ఉంది అని   బీసీబీ అధ్యక్షుడు తెలియ చేయడం జరిగింది. 


అంతకుముందు షకిబుల్ పై సీరియస్ గా చర్యలు తీసుకోవడానికి సిద్ధమైనట్లు నజ్ముల్లా తెలిపిన సంగతి అందరికి తెలిసిందే. అక్టోబర్ 22వ తేదీన గ్రామీ ఫోన్ టెలికాం సంస్థకు షకిబుల్ అంబాసిడర్ గా వ్యవహరించడం జరిగింది. దాంతో బీసీబీ ఆగ్రహం వ్యక్తం చేసింది. మా నియమ నిబంధనల్ని ఉల్లంఘించిన ఏ ఒక్క క్రికెటర్ ను ఉపేక్షించేది లేదు. మాకు షకీబుల్ పరిహారం చెల్లించుకోవాల్సింది అని బీసీబీ తెలిపింది.


  కంపెనీతో పాటు సదరు ఆటగాడు కూడా మాకు నష్టపరిహారం ఇవ్వాల్సిందే. దీనిపై ఇప్పటికే కంపెనీ నుంచి పరిహారం కోరుతూ లీగల్ నోటీసు పంపించడం కూడా జరిగింది. షకీబుల్ దీనిపై వివరణ ఇవ్వాలని కోరతాం.. దాంతో పాటు పరిహారం కూడా చెల్లించాల్సి ఉంటుంది. లేకపోతే కఠినమైన చర్యలు తీసుకుంటాం అని తెలియ చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: