2022 ఐపీఎల్ సీజన్ లో భాగంగా అద్భుతమైన ప్రదర్శన కొనసాగిస్తుంది అనుకున్న చెన్నై సూపర్ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వరుసగా నాలుగు మ్యాచ్ల్లో ఓటమి చవిచూసింది చెన్నై సూపర్ కింగ్స్ జట్టు. అయితే ఇటీవలే చెన్నై సూపర్ కింగ్స్ ఆడిన ఐదవ మ్యాచ్ లో మాత్రం అద్భుతమైన ప్రదర్శన చేసింది అన్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో 94 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద శివమ్ దూబే భారీ షాట్కు ప్రయత్నించి చివరికి 95 పరుగులకే  పరిమితం కావాల్సి వచ్చింది. దీంతో 95 పరుగులు చేసి శతకాన్ని చేజార్చుకున్నాడు. ఈ యువ ఆటగాడి  బ్యాటింగ్ పై ప్రస్తుతం మాజీ క్రికెటర్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.


 అతని బ్యాటింగ్ స్టైల్ అద్భుతంగా ఉంది అంటూ ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు. అయితే ఇటీవల ఇదే విషయంపై టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. శివం దూబే ను అభినందిస్తూ సచిన్ టెండూల్కర్ తో తనకు ఉన్న పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు. ఇటీవలే ఒక క్రీడా ఛానల్ తో మాట్లాడిన వీరేంద్ర సెహ్వాగ్ ఎవరైనా సరే శతకం చేసిన తర్వాత ఆ జట్టు ఓటమి పాలైతే అప్పుడు పరిస్థితి ఏంటి.. ఇలా చాలాసార్లు జరిగింది అని వీరేంద్ర సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలోనే సచిన్ టెండూల్కర్ చెప్పిన ఒక విషయాన్ని ఈ సందర్భంగా వీరేంద్ర సెహ్వాగ్ నెమరువేసుకున్నారు అని చెప్పాలి.

 క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఎంతో కష్టపడి సెంచరీ చేసిన ఇక చివరికి ఓడిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి అంటూ వీరేంద్ర సెహ్వాగ్ వివరించాడు. అలాగే శతకం జారినప్పుడు మ్యాచ్ గెలిచినా  సందర్భాలు కూడా ఉన్నాయని తెలిపారు. ఈ విషయం స్వయంగా సచిన్ టెండూల్కర్ తనతో చెప్పినట్లు పేర్కొన్నాడు వీరేంద్ర సెహ్వాగ్. 2011 ప్రపంచ కప్ పాకిస్తాన్ సెమీఫైనల్ మ్యాచ్లో సచిన్ టెండూల్కర్ 85 పరుగుల వద్ద  వికెట్ కోల్పోయాడు. తర్వాత డ్రెస్సింగ్ రూమ్ లోకి వస్తున్నప్పుడు చిన్నగా నవ్వాడు.. సెంచరీ మిస్సయినందుకు  బాధ లేదు అని అడిగితే అతను చెప్పిన సమాధానం ఆశ్చర్యానికి గురి చేసింది. నేను సెంచరీ చేయలేక పోవడమే మంచిది ఎవరికి తెలుసు ఒకవేళ ఓడిపోతే అని సచిన్ చేసిన వ్యాఖ్యలు ఆశ్చర్యానికి చూశాయ్ వీరేంద్ర సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు..

మరింత సమాచారం తెలుసుకోండి: