ఈ క్రమంలోనే వరల్డ్ కప్ ముగిసిన వెంటనే టీమిండియా ఏ దేశ పర్యటనకు వెళ్లబోతుంది అన్న విషయాన్ని ఇటీవల బీసీసీఐ అధికారికంగా ప్రకటిస్తూ ఉండడం గమనార్హం. ఈ క్రమంలోనే దాదాపు ఏడేళ్ల గ్యాప్ తర్వాత ఏకంగా బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లేందుకు టీమిండియా సిద్ధమవడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. దాదాపు ఏడేళ్ల నుంచి కూడా బంగ్లాదేశ్ పర్యటనకు దూరంగానే ఉంది టీమిండియ. భద్రతపరమైన కారణాల దృశ్య మరిన్ని రీజన్స్ తో ఇలా బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లడం లేదు.. కానీ ఇప్పుడు ఏడేళ్ల గ్యాప్ తర్వాత బంగ్లాదేశ్ పర్యటనకు సిద్ధమైంది.
ఈ క్రమంలోనే బంగ్లాదేశ్ పర్యటనలో భాగంగా మూడు వన్డేలు రెండు టెస్ట్ మ్యాచ్ లలో సిరీస్ ఆడబోతుంది అనేది తెలుస్తుంది. ఇక డిసెంబర్ 4వ తేదీ నుంచి బంగ్లాదేశ్ టూర్ ప్రారంభం కాబోతుంది. కాగా 2015లో భారత్ చివరిసారిగా బంగ్లాదేశ్లో పర్యటించింది. అయితే రెండు దేశాల మధ్య చిరస్మరణీయమైన సిరీస్ కోసం ఎంతోమంది క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్నారు అంటూ అటు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తెలిపింది అని చెప్పాలి. కాగా డిసెంబర్ 4, 7, 10 తేదీలలో 3 వన్డే మ్యాచ్లు జరగబోతున్నాయి. డిసెంబర్ 14, 18, 22, 26 తేదీలలో ఇక రెండు టెస్ట్ మ్యాచ్లు జరగబోతున్నాయి అని చెప్పాలి.