గత నాలుగు రోజుల నుండి చట్టోగ్రామ్ వేదికగా ఇండియా మరియు బంగ్లాదేశ్ ల మధ్యన మొదటి టెస్ట్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇరు జట్లు విజయం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాయి, నిన్న రెండవఇన్నింగ్స్ ను డెలికేరి చేసిన ఇండియా బంగ్లా ముందు 514 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. భారీ టార్గెట్ ను చేధించే క్రమంలో బంగ్లా తడబడుతోంది. అయితే ఇంత భారీ టార్గెట్ ను నిర్దేశించగానే అందరూ కనీసం 200 పరుగులు అయినా చేస్తుందా అని అభిప్రాయపడ్డారు. కానీ సొంతగడ్డపై బంగ్లా తమశక్తికి మించిన విధంగా పోరాడుతోంది.

ఓపెనర్లు జాకీర్ హాసన్ మరియు శాంటోలు మొదటి బంతి నుండి ఆచితూచి ఆడుతూ బంగ్లాకు అద్బుతమయిన మొదటి వికెట్ భాగస్వామ్యాన్ని అందించారు. వీరిద్దరూ కలిసి మొదటి వికెట్ కు 124 పరుగులు జోడించడం విశేషం. అర్ద సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత శాంటో (64) పరుగుల వద్ద ఉండగా ఉమేష్ యాదవ్ బౌలింగ్ లో కీపర్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక ఆ తర్వాత జాకిర్ తో కలిసిన యాసిర్ అలీ మరియు లిటన్ దాస్ లు ఎక్కువ సేపు అతనికి సహకారం అందించడంలో పూర్తిగా ఫెయిల్ అయ్యారు. యాసిర్ అలీ కేవలం 5 పరుగులకే అక్షర్ పటేల్ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు. ఇక లిటన్ దాస్ కూడా 19 పరుగులు చేసి కుల్దీప్ యాదవ్ బౌలింగ్ లో ఉమేష్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.

ఒకవైపు వికెట్లు కోల్పోతున్నా తన కెరీర్ లో మొదటి టెస్ట్ ను ఆడుతున్న ఓపెనర్ జాకీర్ హాసన్ తనపాటికి పరుగు పరుగు జత చేసుకుంటూ వెళుతున్నాడు. ఈ దశలో జాకీర్ హాసన్ కెరీర్ లో ఆడుతున్న మొదటి టెస్ట్ లోనే ఇండియాపై సెంచరీ సాధించాడు. జాకీర్ హాసన్ 224 బంతుల్లో సరిగ్గా 100 పరుగులు చేసి అశ్విన్ బౌలింగ్ లో కోహ్లీ కి క్యాచ్ ఇచ్చి ఘనంగా పెవిలియన్ చేరాడు. బంగ్లా తరపున ఆరంభ టెస్ట్ లో సెంచరీ చేసిన వారిలో జాకీర్ హాసన్ నాలుగవ ఆటగాడిగా నిలిచి రికార్డ్ సృష్టించాడు. ప్రస్తుతం బంగ్లా జట్టు 280 పరుగులకు 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: