2023 ఏడాదిలో వరుస విజయాలతో టీమ్ ఇండియా జట్టు దూసుకుపోతుంది అన్న విషయం తెలిసిందే. ఫార్మాట్ తో సంబంధం లేకుండా అద్వితీయమైన ప్రదర్శన కనబరుస్తుంది. ఈ క్రమంలోనే ఇక ఈ కొత్త ఏడాదిలో హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో బరిలోకి దిగిన టీమిండియా జట్టు ఇక టి20 సిరీస్ లో భాగంగా భాగంగా శ్రీలంక జట్టును చిత్తు చేసింది అని చెప్పాలి. అయితే ఇక అదే జోరుతో వన్డే సిరీస్ ప్రారంభించిన టీమ్ ఇండియా జట్టు ఇక మరోసారి అదరగొట్టింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.


 మొదటి వన్డే మ్యాచ్ లో భాగంగా 67 పరుగుల భారీ తేడాతో విజయం సాధించిన టీమిండియా జట్టు రెండు వన్డే మ్యాచ్లో కూడా అదే జోరును కనబరిచింది అని చెప్పాలి. ప్రత్యర్థి శ్రీలంక జట్టు పైన నాలుగు వికెట్ల తేడాతో విజయాన్ని సాధించింది. ఈ క్రమంలోనే మూడు మ్యాచ్ల సిరీస్ లో భాగంగా వరుసగా రెండు మ్యాచ్లలో విజయం సాధించి 2-0 తేడాతో ఏకంగా సిరీస్ ను కైవసం చేసుకుంది అని చెప్పాలి. అయితే ఇలా కొత్త సంవత్సరంలో ఒకవైపు టి20 సిరీస్ మరోవైపు వన్డే సిరీస్ సాధించి అదరగొట్టింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే ఇక ఈ విజయం అనంతరం మాట్లాడిన రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.


 మ్యాచ్ విజయంలో ఎంతో కీలకపాత్ర వహించిన బ్యాట్స్మెన్ కేఎల్ రాహుల్, బౌలర్ కూల్దీప్ యాదవ్ లపై ప్రశంసలు కురిపించాడు అని చెప్పాలి. ఇది చాలా క్లోజ్ మ్యాచ్ ఇలాంటి మ్యాచ్లు ఎన్నో అనుభవాలను ఇస్తూ ఉంటాయి. తీవ్ర ఒత్తిడిలో  మేము ఇన్నింగ్స్ ని నిర్మించాము. వన్డే ఫార్మాట్లో ఎన్నో రోజుల నుంచి కేఎల్ రాహుల్ 5వ స్థానంలో బాటింగ్ చేస్తున్నాడు. అతని బ్యాటింగ్లో డెప్త్ పెరగడమే కాదు ఆత్మవిశ్వాసం కూడా రెట్టింపు అయినట్లు కనిపిస్తుంది. ఇక కుల్దీప్ యాదవ్ తనకు వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకొని అసాధారణ ప్రదర్శనతో మమ్మల్ని మ్యాచ్లో నిలబెట్టాడు. ఇలా కేఎల్ రాహుల్ కుల్దీప్ యాదవ్ కారణంగానే మ్యాచ్ గెలిచాము అని చెప్పాలి అంటూ రోహిత్ శర్మ వ్యాఖ్యానించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: