ఇక టీమిండియా క్రికెటర్ పృథ్వీషా సెల్ఫీ వివాదం మరో సారి మరో మలుపు తిరిగింది. పృథ్వీషా కారుపై దాడి కేసులో అరెస్టయిన ఫేమస్ యూట్యూబర్‌ ఇంకా బాలీవుడ్ నటి స్వప్నా గిల్‌ అతనిపై సంచలన ఆరోపణలు చేశారు.ఈ ఆరోపణలు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతూ తెగ వైరల్ అవుతున్నాయి.తన పట్ల పృథ్వీషా చాలా దారుణంగా అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపించడంతో ముంబై పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది.


ఇక దీనిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదవ్వడం జరిగింది.అంతేగాక అసలు ఈ పృథ్వీషా కూడా ఎవరో తనకు తెలియదని, అసలు అతన్ని సెల్ఫీ కూడా అడగలేదన్నారు స్వప్నా గిల్‌. ఇక క్లబ్‌కు తనతో పాటు మరొకరే వచ్చారని.. డబ్బుల కోసం ఎవరిని బెదిరించలేదని కూడా అన్నారు.ఇక ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 'మేం కండలు తిరిగిన వీరులం కాదు.. ఏకంగా పదిమందిని ఒకేసారి కొట్టడానికి సౌత్‌ హీరోలం కానేకాదు. డబ్బులు అడిగామని, లేదంటే తలపలగొడుతామని మాపై ఇలా తప్పుడు కేసులు పెట్టారు. క్లబ్‌కు కేవలం మేం ఇద్దరమే వెళ్లాం..పృథ్వీషా ఎవరో కూడా మాకు తెలియదు…అతన్ని అసలు సెల్ఫీ కావాలని కూడా అడగలేదు' అంటూ చెప్పుకొచ్చింది.


ఇక స్వప్నా గిల్‌ ఫిర్యాదుతో ఈ వ్యవహారం ఇప్పట్లో చల్లారే అవకాశాలు ఇంకా కన్పించడం లేదు. సరిగ్గా నాలుగు రోజుల క్రితం ముంబయిలోని ఓ హోటెల్‌కు వచ్చిన పృథ్వీషాతో సెల్ఫీ దిగేందుకు సప్నా గిల్ ఆమె స్నేహితులు ప్రయత్నించినట్టు అనేక ఆరోపణలు వచ్చాయి. మొదట ఒ సెల్ఫీ దిగేందుకు అనుమతించిన పృథ్వీషా వారు పదే పదే అడగడంతో నిరాకరించడం జరిగింది. దీంతో హోటెల్ నుంచి బయటకు వెళ్లిన తర్వాత కూడా క్రికెటర్‌ను వెంబడించి అతడితో గొడవకి దిగారని, తన స్నేహితుడి కారును ధ్వంసం చేశారని కూడా ఆరోపించాడు. ఇక దీంతో ముంబయి ఓషివారా పోలీసులు సప్నా గిల్ సహ 8 మందిని అరెస్టు చేశారు. తాజాగా బెయిల్‌పై బయటకు వచ్చిన సప్నా.. పృథ్వీషాపై తిరిగి కేసు పెట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: