ఒకవైపు బౌలింగ్లో మరోవైపు బ్యాటింగ్లో కూడా టీమ్ ఇండియా కంటే మెరుగ్గా రాణిస్తూ ఇక మూడవ టెస్ట్ మ్యాచ్లో విజయం సాధించేలాగే కనిపిస్తూ ఉంది. ఇక ప్రస్తుత పరిస్థితులు చూస్తూ ఉంటే రెండు మ్యాచ్ లలో గెలిచిన టీమ్ ఇండియా మూడో మ్యాచ్లో మాత్రం ఓటమి నుంచి తప్పించుకోవడం కష్టమే అనిపిస్తుంది. అయితే 59 పరుగులు చేసి ఇక ఒంటరి పోరాటం చేసిన పూజార ఇక జట్టుకు మరింత మంచి స్కోర్ అందిస్తాడు అనుకుంటే చివరికి వికెట్ కోల్పోయాడు అని చెప్పాలి. అయితే రెండో రోజు ఆటలో టీమిండియా ఇన్నింగ్ సమయంలో ఒక ఆసక్తికర ఘటన జరిగింది.
అప్పటికే టీమ్ ఇండియా 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఇక పూజార 52 పరుగుల వద్ద వద్ద ఉండగా అక్షర్ పటేల్ నాలుగు పరుగులతో క్రీజులో ఉన్నాడు. అయితే బంతి ఎక్కువగా టర్న్ తీసుకుంటూ ఉండడంతో అటు అక్షర్ పటేల్ సేఫ్ జోన్ లోనే బ్యాటింగ్ చేస్తూ ఉన్నాడు. పరుగులు రాకపోయినా పర్వాలేదు అని డిఫెన్స్ ఆడుతూ ఉన్నాడు. ఇలాంటి సమయంలో ఇషాన్ కిషన్ పిలిచిన కెప్టెన్ రోహిత్ శర్మ అక్షర్ ను చూపిస్తూ భారీ శిక్ష కొడితే బాగుండు అని చెప్పాడు. అయితే రోహిత్ అన్నమాట పూజార చెవిన పడిందో ఏమో కానీ రోహిత్ అలా అన్నాడో లేదో పూజార మిడ్ వికెట్ మీదుగా భారీ సిక్సర్ కొట్టాడు. ఇది చూసిన రోహిత్ చిన్నగా నవ్వుకొని ఎస్ అంటూఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. ఇక ఇది కాస్త ట్విటర్లో వైరల్ గా మారిపోయింది.