ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్లో భాగంగా ప్రతి మ్యాచ్ కూడా ఎంతో ఉత్కంఠ భరితంగా సాగుతుంది. ప్రేక్షకులు ఊహించిన దానికంటే ఎక్కువగా ఎంటర్టైన్మెంట్ అందిస్తుంది. దీంతో ఇక ఈ క్రికెట్ మజాని తెగ ఎంజాయ్ చేస్తున్నారు ప్రేక్షకులు. అదే సమయంలో ఇక ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ ను అటు గాయాలు బెడద  కూడా తీవ్రంగా వేధిస్తుంది. ఇక ఐపీఎల్ జట్లలోని ఎంతో మంది కీలక ప్లేయర్లు గాయం బారిన పడుతున్నారు. కొంతమంది కేవలం కొన్ని మ్యాచ్లకు మాత్రమే దూరంగా ఉంటుంటే.. ఇంకొంతమంది ఏకంగా ఐపీఎల్ టోర్ని మొత్తానికి దూరం కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.


 కొంతమంది అయితే ఏకంగా గాయంతో సర్జరీ చేయించుకుని కొన్ని నెలలపాటు క్రికెట్ కు దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టులో స్టార్ ప్లేయర్గా కొనసాగుతున్న రజత్ పాటిదర్ సైతం ఇలాగే గాయం బారిన పడ్డాడు. ఆర్సిబి జట్టులోకి వచ్చి తనదైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు రజత్ పాటీదార్. తనద ప్రదర్శనతో ఏకంగా జట్టులో కీలక ప్లేయర్గా మారిపోయాడు. అయితే గాయం బారిన పడి జట్టుకు దూరమయ్యాడు.  గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఇక సర్జరీ తప్పనిసరి అని వైద్యులు సూచించినట్లు తెలుస్తోంది.



 అయితే ఇక అతని గాయం కి సంబంధించిన అప్డేట్ మాత్రం ఇప్పటివరకు రాలేదు. కాగా ఇటీవల సోషల్ మీడియా వేదిక స్పందించిన రజత్ పాటిదార్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పాడు. కాలి మడమ గాయంతో బాధపడుతున్న ప్లేయర్ ప్రస్తుతం ఇంగ్లాండ్లో చికిత్స తీసుకుంటున్నాడు. అయితే తన సర్జరీ అప్డేట్ను ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. సర్జరీ విజయవంతంగా పూర్తయిందని.. రికవరీకి సిద్ధంగా ఉన్నాను అంటూ తెలిపాడు. నా రికవరీ గురించి ప్రార్థించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అంటూ చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలోనే హాస్పిటల్ బెడ్ మీద ఉన్న ఫోటోని షేర్ చేశాడు రజాత్ పాటిదార్. ఇక అతను సర్జరీ సక్సెస్ కావడంతో ఫాన్స్ సంతోషంలో మునిగిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl