అయితే కొంత సమాచారం ప్రకారం వీరిద్దరితో పాటుగా మరి కొంతమంది తల్లులున్నారని తెలుస్తోంది. మరి వారి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వాసుదేవుడు దేవకిలకు పుట్టిన కృష్ణుడిగా మనకు తెలిసిందే. అయితే దేవకి కన్నా ముందు వసుదేవుడికి రోహిణితో పెళ్లి అయింది. బలరాముడు, సుభద్ర, ఏకాంగ దేవి వీరి సంతానంగా ఉంటారు. ఆ కారణంగా రోహిణి కృష్ణుడికి తల్లి వరుస అయింది. ఈ మాధవుడు...సందీపని భార్య యైన సుముఖి దేవికి కూడా తనకు తల్లి అయ్యే అదృష్టాన్ని ప్రసాదించాడు. అప్పట్లో శ్రీకృష్ణుడు సందీపని మహర్షి దగ్గర శిక్షణ పొందేవారు. అటువంటి సమయంలో సుముఖి దేవి శ్రీకృష్ణుడిని తన పుత్రుడిగా ఉండేలా గురు దక్షిణ అడుగుతుంది.
ఆ విధంగా ఆమె కూడా తల్లి అయింది. దాని తరువాత భాగవతం ప్రకారం గోకులంలో ఉన్న సమయంలో శ్రీకుష్ణుని చమపడానికి కంసుడు పూతన అనే రాక్షసిని పంపుతాడు. ఆ రాక్షసి కృష్ణుడిని చంపడానికి తన రొమ్ముల్లో కల కూడా విషాన్ని నింపుకుని వస్తుంది. తన మాయతో ఇది తెలుసుకున్న శ్రీ కృష్ణుడు పాలతో పాటు రొమ్ములను చీల్చి ఆ రాక్షసిని చంపేస్తాడు. పూతన అంతిమ సంస్కారాల సమయంలో తన శరీరం నుండి గంధపు చెక్కల సువాసన వస్తుంది. ఆ సంఘటన తరువాత ఈమెకు కూడా శ్రీకృష్ణుడు తల్లి అయ్యే హక్కును కల్పించాడు. ఈ విధంగా శ్రీకృష్ణుడికి మొత్తం అయిదు మంది తల్లులు ఉన్నారు.