
తిరుములలో శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ఎప్పుడు ఏ నైవేద్యం సమర్పిస్తారంటే :
* శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ప్రతీరోజూ కూడా త్రికాల నైవేద్యం ఉంటుంది. అంటే నైవేద్య సమర్పణ మూడు సమయాల్లో ఉంటుంది అని అర్ధం.
* అది ఎలా అంటే..ఉదయం 5.30 గంటలకు, ఉదయం 10గంటలకు, రాత్రి 7.30 గంటలకు ఉంటుంది.
* వీటినే మొదటి గంట నైవేద్యం అని, రెండో గంట నైవేద్యం అని, మూడో గంట నైవేద్యంగా కూడా పిలుస్తారు.
* ఉదయం 5.30నిమిషాలకు మొదటి గంట నైవేద్యం సమర్పిస్తారు. ఆ నివేదనలో చక్రపొంగలి, కదంబం, పులిహోర, దద్ధ్యోజనం, మాత్ర ప్రసాదాలు, లడ్డూలు, వడలు లాంటివి నివేదిస్తారు.
* ఆ త్రువాత ఉదయం 10 గంటలకు రెండో గంట నైవేద్యం సమర్పిస్తారు. అప్పుడు ప్రసాదాలుగా పెరుగన్నం, చక్రపొంగలి, పులిహోర, మిర్యాల పొంగలి, సీర, సాకిరి బాత్ సమర్పిస్తారు.
* ఇక ఆ తరువాత రాత్రి 7.30 నిమిషాలకు మూడో గంట నైవేద్యం సమర్పిస్తారు. ఈ ప్రసాదాల్లో కదంబం, మొలహోర, వడలు, తోమాల దోశలు, లడ్డూ పెడతారు. అంతేకాదు ఆదివారం రోజు ప్రత్యేకంగా గరుడ ప్రసాదంగా చెప్పే పిండిని కూదా శ్రీవారికి నివేదిస్తారు.
* వారంలో ఒక్కరోజు ఈ ప్రసాదాల సంఖ్య పెరుగుతూ కూడా వస్తుంది.
* మరీ ముఖ్యంగా సోమవారం నాడు విశేష పూజ సందర్భంగా స్వామీ వారికి మొత్తంగా 51 పెద్ద దోశలు, 51 చిన్న దోశలు, 51 పెద్ద అప్పాలు, 102 చిన్న అప్పాలను నైవేద్యంగా సమర్పిస్తారు.
* అంతేకాదు ఆ తరువాత మంగళవారం సమర్పించే నైవేద్యంలో మరింత ప్రత్యేకంగా ‘మాత్ర ప్రసాదం’ ఉంటుంది. అలాగే మిగిలినవన్నీ కూడా నిత్యం సమర్పించేవే కచ్చితంగా ఉంటాయి.
* బుధవారం సమర్పించే ప్రసాదాల్లో ప్రత్యేకంగా స్వామీ వార్కి ఇష్టమైన పాయసం, పెసరపప్పు సమర్పిస్తారు.
* ఇక గురువారం నాడు సమర్పించే ప్రసాదాల్లో నిత్యం సమర్పించే ప్రసాదాలతో పాటూ తిరుప్పావడ సేవ సందర్భంగా జిలేబీ, మురుకు, పాయసాలు స్పెషల్ గా నివేదిస్తారు.
* శుక్రవారం స్వామీ వారికి అభిషేక సేవ జరుగుతుంది. ఇది చాలా చాలా స్పెషల్. ఈ కారణంగా ఆ రోజు స్వామివారికి ప్రత్యేకంగా పోళీలు సమర్పిస్తారు.
* స్వామీ వారికి ఎంతో ఇష్టమైన శనివారం రోజు నివేదనలో కదంబం, చక్రపొంగళి, లడ్డూలు, వదలు, పులిహోర, దద్యోజనం, మిర్యాల పొంగలి, సీర, సేకరాబాత్, కదంబం, మొలహోర, తోమాల దోశలు సమర్పిస్తారు.
* మరింత ప్రత్యేకమైన ఏకదాశి, వైకుంఠ ఏకాదశి, ప్రత్యేక పర్వదినాల్లో స్వామీ వారికి దోశలు, శనగపప్పుతో చేసిన గుగ్గిళ్లను నివేదిస్తారు.
* ఇక నెలరోజులపాటు జరిగే ధనుర్మాస వ్రతంలో వెంకటేశ్వర స్వామికి బెల్లం దోశలను ప్రసాదంగా నివేదిస్తారు. ఇలా స్వామివారికి జరిగే నిత్య, పక్ష, వార, మాస, సంవత్సరాది ఉత్సవాల్లో ప్రత్యేకంగా నివేదనలు ఉంటాయి.