ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా జట్టుతో టీమిండియా ఆడబోయే మూడవ టెస్ట్ మ్యాచ్లో జట్టుతో కలవనున్నాడు. ఇటీవలే మెల్బోర్న్ లో ఉన్న టీమిండియా జట్టుతో కలిశాడు రోహిత్ శర్మ. దీనికి సంబంధించిన వీడియోను ఇటీవలే భారత క్రికెట్ నియంత్రణ మండలి సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం టెస్ట్ క్రికెట్ జట్టులో ఉన్న ఆటగాళ్లందరూ బస చేస్తున్న హోటల్కు వెళ్లి రోహిత్ శర్మ సహచరులని పలకరించాడు. రోహిత్ శర్మ రావడంతో సహచరుడు అందరూ కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేశారు.
ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరూ వచ్చి రోహిత్ శర్మను కలిశారు అందరు కలిసిన తర్వాత రోహిత్ శర్మ దగ్గరికి వచ్చిన టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి రోహిత్ శర్మను పలకరించాడు. ఇక తనదైన శైలిలో రోహిత్ శర్మ పై సెటైర్ వేసాడు రవిశాస్త్రి. క్వారంటైన్ ఎలా గడిచింది మై ఫ్రెండ్.. మీ వయసు బాగా తగ్గినట్లు కనిపిస్తుంది అంటూ సెటైర్ వేశాడు.. దీంతో రోహిత్ శర్మ రవి శాస్త్రి సెంటర్కు చిరునవ్వు చిందించాడు. అయితే ఐపీఎల్ లో రోహిత్ శర్మ అధిక బరువు పెరిగాడు అని ఎంతగానో ట్రోల్స్ వచ్చాయి అనే విషయం తెలిసిందే. ఇకపోతే జనవరి 7 నుంచి సిడ్నీ వేదికగా జరగబోయే మూడవ టెస్ట్ మ్యాచ్ కోసం రోహిత్ శర్మ ని ఆడించాలని పెద్ద ఎత్తున డిమాండ్ కూడా వస్తుంది. ఇక రోహిత్ శర్మ జట్టులోకి చేరిన తర్వాత భారత జట్టు ఎలా రాణిస్తోంది అన్నది ఆసక్తికరంగా మారింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి