సాధారణంగా అన్ని దేశాల జట్లను ఎన్ని టోర్నీలు ఆడినప్పటికీ వరల్డ్ కప్ మాత్రం అన్ని జట్లకు కూడా ఎంతో ప్రత్యేకం అన్న విషయం తెలిసిందే. వరల్డ్ కప్ గెలవడానికి ఎన్నో రోజుల నుంచి ఎంతగానో సాధన చేస్తూ ఉంటాయి అన్ని దేశాల క్రికెట్ జట్లు. అయితే భారత జట్టు కూడా ఇప్పటివరకు మూడు సార్లు వరల్డ్ కప్  గెలిచి సత్తా చాటింది. అయితే 1983లో అతి చిన్న జట్టుగా వరల్డ్ కప్ లోకి ఎంట్రీ ఇచ్చిన భారత జట్టు వరుస విజయాలను సాధించి కుంటూ అప్పుడు దిగ్గజ జట్లుగా కొనసాగుతున్న అన్ని జట్లను మట్టికరిపించి చివరికి ఫైనల్ వరకు వెళ్ళింది. ఇక ఫైనల్లో హోరాహోరీ పోరాటం చేసిన భారత జట్టు మొట్టమొదటిసారి భారత క్రికెట్ చరిత్రలోనే వరల్డ్ కప్ ని ముద్దాడింది. ఇక ఇది భారత క్రికెట్ ప్రేక్షకులందరూ ఎప్పుడు మర్చిపోలేని రోజు అని చెప్పాలి.



 అయితే 1983 తర్వాత ఇక వరల్డ్ కప్ భారత జట్టుకు అందని ద్రాక్షలా గా మారిపోయింది అని చెప్పాలి. పదేళ్లు గడిచిపోయాయి ఇంకా వరల్డ్ కప్
గెలుచుకుకోలేక పోయింది భారత్. ఇక దాదాపు 28 ఏళ్ల తర్వాత మళ్లీ భారత జట్టు వరల్డ్ కప్ గెలుచుకుంది.సరిగ్గా ఇదే రోజున 2011 సంవత్సరంలో భారత జట్టు రెండవసారి వరల్డ్ కప్ ను ముద్దాడింది భారత జట్టు. క్రికెట్ ప్రేక్షకులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది.  దీంతో అటు భారత క్రికెట్ ప్రేక్షకుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.  సరిగ్గా 2011 సంవత్సరంలో ఏప్రిల్ 2వ తేదీన శ్రీలంక భారత్ మధ్య వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరుగగా..  టీమిండియా ఘన విజయాన్ని అందుకుంది.


 1983 తర్వాత అందని ద్రాక్షల మారిన వరల్డ్ కప్ 2011 ఏప్రిల్ రెండవ తేదీన భారత జట్టు దక్కించుచుకుంది. ధోనీ మ్యాచ్ విన్నింగ్ షాట్ కొట్టగానే ఇండియా లిఫ్ట్ ది వరల్డ్ కప్ అంటూ అప్పటి కామెంటేటర్ రవిశాస్త్రి మాట్లాడిన మాటలు కూడా ప్రేక్షకుల చెవిలో ధ్వనిస్తూనే ఉన్నాయ్. అంతేకాదు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇక వరల్డ్ కప్ కి సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం వైరల్ గా మారిపోయింది. ఇక 2011 సంవత్సరం ఏప్రిల్ 2వ తేదీన జరిగిన వరల్డ్ కప్ ఫైనల్ లో గౌతం గంభీర్ 97.. మహేంద్రసింగ్ ధోని 91  చేసిన వీరోచిత పోరాటాన్ని ఇప్పటికి కూడా అటు క్రికెట్ ప్రేక్షకులు మరువలేరు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: