క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఇక గెలవాలి అనే ఉద్దేశంతో ఈ రెండు జట్ల ఆటగాళ్లు మధ్య చిన్నచిన్న వాగ్వాదాలు జరగడం చూస్తూ ఉంటాం. ఇక ఒకరినొకరు ద్వేషించుకొంటూ ఇక ఆ తర్వాత ఎంపైర్లు కల్పించకపోవడంతో ఇక ఆటగాళ్ల మధ్య వివాదం సద్దుమణగటం లాంటివి జరుగుతూ ఉంటుంది. అయితే కొన్ని కొన్ని సార్లు ఏకంగా ఆటగాళ్ల మధ్య ఒకరిపై ఒకరు బ్యాట్లు విసుక్కునేంతవరకు కూడా వెళుతూ ఉంటుంది గొడవ. ఇలాంటి గొడవలు అంతర్జాతీయ క్రికెట్లో చాలా తక్కువ జరుగుతూ ఉంటాయి  కానీ కొన్ని కొన్ని చిన్న టోర్నీలలో మాత్రం ఇలాంటి గొడవలు తరచు కనిపిస్తూ ఉంటాయి.  ఇక్కడ ఇలాంటి తరహా వివాదం జరిగింది..



 ఏకంగా క్రికెట్ మ్యాచ్ లో తలెత్తిన వివాదం కారణంగా ఇరువురు క్రికెటర్ల మధ్య గొడవ జరిగింది. ఎంత వరకు వెళ్ళింది అంటే ఏకంగా యుద్ధం జరుగుతుందేమో అని రీతిలో గొడవ జరిగింది వేగంగా ఒకరిని ఒకరు క్రికెట్ బ్యాట్ లతో అతి దారుణంగా కొట్టుకున్నారు. ఈ ఘటన ఇంగ్లాండ్ లో చోటుచేసుకుంది. పాకిస్తాన్ లో వైద్యం అవసరమైన పేదల కోసం షేహజాన్ అక్రమ్ ఆధ్వర్యంలో ఓ చారిటీ మ్యాచ్ ని మాటే క్రికెట్ క్లబ్ లో నిర్వహించారు. ఎంతో మంచి పని కోసం నిర్వహించిన ఈ క్రికెట్ మ్యాచ్ కాస్తా ఏకంగా రణరంగంగా మారిపోయింది. రక్తపాతం తో ముగిసింది. అయితే ఇంత పెద్ద గొడవ జరగడానికి కారణం ఏందో తెలియదు కానీ ఏకంగా ఇరు జట్ల ఆటగాళ్లు ఒకరినొకరు దూషించుకొంటూ ఇక బ్యాట్ లతో ఒకరిపై ఒకరు దాడులు చేస్తూ కనిపించారు.



 అక్కడున్న వారు వారిని కంట్రోల్ చేసేందుకు ఎంత ప్రయత్నించినప్పటికీ లాభం లేకుండా పోయింది. ఇక ఇలా ఒకరిపై ఒకరు బ్యాట్ లతో దాడి చేసుకోవడంతో ఏకంగా ఆటగాళ్లకు తీవ్రమైన గాయాలయ్యాయి. దీంతో చివరికి ఇద్దరు కిందపడిపోయారు. అయితే దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. అయితే ఇలా గొడవ జరిగిన మ్యాచ్ ఫైనల్ మ్యాచ్ కావడం గమనార్హం. మరో రెండు ఓవర్లలో ముగిసిపోతుంది అనుకుంటున్న తరుణంలో కొంతమంది వ్యక్తులు గ్రౌండ్ లోకి వచ్చి గొడవ స్టార్ట్ చేశారు. అయితే ఈ గొడవ తలెత్తడానికి కారణం ఏంటి అన్న దానిపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. ఇక ఈ గొడవ తర్వాత  పేదలకు వైద్యం అందించడం కోసం నిర్వహించిన చారిటీ మ్యాచ్ నాశనం చేశారు అని షహజాద్ అక్రమ్ నిరాశ వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: