అంతే కాకుండా ఎంతో ముఖ్యమైన టీ 20 వరల్డ్ కప్ 2021 కు ఎంపిక కావడంలో ఫెయిల్ అయ్యాడు. అందుకు కారణం ఫామ్ లో లేకపోవడమే. అయితే తన సత్తాను నిరూపించుకోవడం కోసం వరల్డ్ కప్ కు ముందు జూనియర్ టీం కు కెప్టెన్ గా నియమించి శ్రీలంక పర్యటనకు పంపింది బీసీసీఐ. కానీ అక్కడ కూడా ఆటగాళ్ల నుండి మెరుగైన ఆటతీరును రాబట్టుకోవడంలోనూ మరియు ఆటగాడిగానూ సక్సెస్ కాలేకపోయాడు. ఇలా వివిధ కారణాలతో పూర్తిగా సీనియర్ జట్టు నుండి పక్కన పెట్టడం జరిగింది.
అయితే కొత్త సంవత్సరం కలిసి వచ్చిందో ఏమో తెలియదు కానీ, నిన్న సౌత్ ఆఫ్రికాతో ఆడాల్సిన మూడు వన్ డే ల సిరీస్ కోసం ప్రకటించిన జట్టులో శిఖర్ ధావన్ కు చోటు దక్కింది. అయితే ఈ సిరీస్ లో కనుక తనకు అవకాశం వచ్చి మెరుగ్గా రాణించకపోతే తన కెరీర్ ప్రమాదంలో పడినట్లేనని క్రికెట్ విశ్లేషకులు చెవులు కొరుక్కుంటున్నారు. కాబట్టి ఈ సిరీస్ ధావన్ కు ప్రాణవాయువు లాంటిది, మరి ఏ విధంగా వాడుకుంటాడో అన్నది తెలియాలంటే ఇంకా మూడు వారాలు ఆగాల్సిందే.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి