అలాంటి టీమిండియా జట్టు అటు వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నీ లలో మాత్రం ఎందుకో ఆశించిన స్థాయిలో ప్రదర్శన చేయలేక పోతుంది. ఇక ఇందుకు ఇటీవలే ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టి20 వరల్డ్ కప్ నిదర్శనం అని చెప్పాలి. ఒకప్పుడు కోహ్లీ కెప్టెన్ గా ఉన్న సమయంలో కూడా ద్వైపాక్షిక సిరీస్లలో ఎన్నో చారిత్రాత్మక విజయాలు సాధించిన టీమిండియా వరల్డ్ కప్లలో మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. రోహిత్ శర్మ సారధిగా వచ్చిన తర్వాత పరిస్థితుల్లో మార్పు వస్తుంది అనుకున్నప్పటికీ మళ్లీ అదే వైఫల్యం కొనసాగింది.
ముఖ్యంగా ఏడాది టీ20లలో టీమిండి అదరగొట్టింది అని చెప్పాలి. వెస్టిండీస్ తో 3-0, శ్రీలంక తో 3-0, ఐర్లాండ్ 2-0, ఇంగ్లాండ్ తో 2- 1, వెస్టిండీస్ పై 4 - 1, ఆస్ట్రేలియాపై 2-1, సౌత్ ఆఫ్రికాపై 2-1, న్యూజిలాండ్ పై 1 - 0 ఇలా అన్ని జట్లను ఓడించి సిరీస్ కైవసం చేసుకుంది. కానీ ఆసియా కప్ వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నీలలో మాత్రం చతికిలబడింది టీం ఇండియా. దీంతో ఫాన్స్ మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ద్వైపాక్షిక సిరీస్లలో గెలిస్తే ఏం వస్తుంది వరల్డ్ కప్ గెలిస్తే కదా అసలైన విజయం సాధించినట్లు అవుతుంది అంటూ ఎంతో మంది ప్రేక్షకులు కామెంట్లు చేస్తున్నారు.