
ఇక రవిచంద్రన్ అశ్విన్ తర్వాత మరికొంతమంది మన్కడింగ్ చేసి ఇక వివాదాల్లో చిక్కుకున్నారూ అన్న విషయం తెలిసిందే. ఇంతకీ ఇప్పుడు మన్కడింగ్ గురించి ఎందుకు ప్రస్తావన వచ్చింది అంటారా.. ఇటీవలే మరోసారి రవిచంద్రన్ అశ్విన్ ఐపీఎల్ లో మన్కడింగ్ చేసేందుకు ప్రయత్నించాడు. ఇటీవల రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది అన్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో పంజాబ్ జట్టు విజయం సాధించింది. అయితే ఇలా పంజాబ్ ఇన్నింగ్స్ ఏడో ఓవర్లో 4 బంతిని వేయడానికి ముందే పంజాబ్ కెప్టెన్ ధావన్ క్రీజు దాటేసాడు. ఇది గమనించిన అశ్విన్ బంతిని వేయడం ఆపేసి మన్కడింగ్ చేయడానికి ప్రయత్నించాడు.
కానీ బంతిని బేయిల్స్ కి తగిలించకుండా దావన్ కూ వార్నింగ్ తోనే సరిపెట్టాడు రవిచంద్రన్ అశ్విన్. ఇక ఆ సమయంలో ఇక టీమ్ ఇండియాలో సహచరుడు విషయంలో అశ్విన్ క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాడు అని చెప్పాలి. ఇక తర్వాత క్రీజులోకి వచ్చిన శిఖర్ ధావన్ అశ్విన్ చూస్తూ చేసేయాల్సింది అన్న తరహాలో చిన్న స్మైల్ కూడా ఇచ్చాడు. ఇక ఇందుకు సంబంధించిన వీడియో ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. ఇక రవిచంద్రన్ అశ్విన్ ఇక ఇలా మన్కడింగ్ చేసేందుకు ప్రయత్నించగానే కెమెరా ఒక్కసారిగా బట్లర్ వైపు తిరిగింది. ఎందుకంటే గతంలో బట్లర్ ను మన్కడింగ్ చేసి పెవిలియన్ పంపించాడు అశ్విన్.