ఆ వీడియోను జియో సినిమా తన సొంత యూట్యూబ్ ఛానెల్ లో పోస్ట్ చేయడం కొసమెరుపు. ఈ సందర్భంగా ఏబీ డివిలియర్స్ మాట్లాడుతూ... "విరాట్ కోహ్లితో కలిసి ఆడటం అనేది మర్చిపోలేని అనుభూతి. అతగాడు చాలా మంది యువకులకు స్ఫూర్తిగా నిలిచాడు. అతడు అత్యుత్తమ ఆటగాడని చెప్పడానికి ఎంతమాత్రం సంకోచించను. ఇక కెప్టెన్ కూల్ ఈ ఐపీఎల్ సీజన్లో జట్టును ఎలా నడిపించాడో అందరికీ తెలిసిన విషయమే. చివర్లో బ్యాటింగ్ కి దిగినా ఆ క్రేజ్ మాత్రం తగ్గలేదు. నిస్వార్ధంగా జట్టు కోసం కష్టపడే ఏకైక క్రికెటర్ ధోని. విరాట్, ధోనీ అంటే నాకు చాలా గౌరవం ఉంది. ఎవరి ప్రదర్శనను తక్కువగా చేసి మాట్లాడడం కష్టం!" అని తెలిపాడు.
ఇకపోతే, 2011 తర్వాత జరిగిన 2 వన్డే ప్రపంచకప్ ల్లోనూ భారత్ సెమీస్ వరకు చేరినప్పటికీ ఓటమి పాలైంది. ఈసారి రోహిత్ నాయకత్వంలో బరిలోకి దిగుతున్న టీమ్ండియా విజేతగా నిలిచేందుకు వున్న అన్ని అవకాశాలను పుష్కలంగా వాడుకోవాలని చూస్తోంది. ధోనీ సారథ్యంలోనే భారత్ కి చివరి ఐసీసీ టైటిల్ (ఛాంపియన్స్ ట్రోఫీ 2013) దక్కిందనే విషయం అందరికీ విదితమే. ఇక పదేళ్ల నిరీక్షణకు తెరదించాలంటే అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19వ తేదీ వరకు జరిగే వన్డే ప్రపంచకప్ భారత్ ఖచ్చితంగా గెలిచి తీరాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి